DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో మొదటి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కి ఏర్పాట్లు పూర్తి :

విద్యార్థులకు ఐడి చూపితే మ్యాచ్ à°•à°¿ ఉచిత ప్రవేశం. 

5 రోజులకూ అమ్ముడు పోయిన టికెట్లు 6227 మాత్రమే . .

2  à°¨à±à°‚à°šà°¿ భారత్ - దక్షిణాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య తోలి

టెస్ట్ 

ట్రాఫిక్ నిబంధనలు ఉండవు: సీపీ మీనా

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . . 

విశాఖపట్నం, సెప్టెంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) : అక్టోబర్ 2 నుంచి విశాఖపట్నం వేదికగా

భారత్ - దక్షిణాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య జరుగనున్న మొదటి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహక కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ వి. వినయ్

చంద్ తెలిపారు. సోమవారం విశాఖ పోతినమల్లయ్య పాలెం లోకి డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ మైదానం లో జరిగిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ విశాఖ

వేదిక గా జరుగుతున్న తోలి టెస్ట్ మ్యాచ్ కావడంతో ఆంధ్ర క్రికెట్ సంఘం, విశాఖపట్నం జిల్లా క్రికెట్ సంఘం, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. జిల్లా

యంత్రాంగం, పోలీసు విభాగం సంపూర్ణ సహకారం అందిస్తున్నామన్నారు.  à°ˆ సమావేశంలో ఆంధ్ర క్రికెట్ సంఘం నూతన  à°…ధ్యక్షుడు శరత్ చంద్రా రెడ్డి, కార్యదర్శి దుర్గ

ప్రసాద్, సి ఆర్  à°®à±‹à°¹à°¨à±  à°µà°¿à°¶à°¾à°– జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు, మాజీ ఎంఎల్ఏ పి విష్ణుకుమార్ రాజు, నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్

కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ సృజన, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు à°Ÿà°¿ ఎస్ ఆర్ ప్రసాద్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.    

విద్యార్థులకు గేట్ " 8 " నుంచి

 à°‰à°šà°¿à°¤ ప్రవేశం: 

విశాఖ లో జరుగుతున్న తోలి టెస్ట్ మ్యాచ్ ను వీక్షించేందుకు కళాశాలల విద్యార్థులు, స్కూల్ విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం

కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం దసరా సెలవలు కావడం పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు రావాలని పిలుపునిచ్చారు. చిన్నారులకు ప్రవేశం

ఉచితమని, వీరితో వచ్చే సహాయకులు, సంరక్షకులు రూ. 100 టికెట్లు కొనవలసి యుంటుందన్నారు. కళాశాల విద్యార్థులకు సహాయకులు అవసరం లేదన్నారు. విద్యార్థుల తమ విద్యా సంస్థ

గుర్తింపు కార్డును తమ వెంట తప్పని సరిగా తీసుకురావాలన్నారు.  

టిక్కెట్ల విక్రయం తక్కువే :

ఐదు రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ మ్యాచ్ కు టికెట్ల విక్రయం

తక్కువగానే ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు. మొత్తం స్టేడియం కెపాసిటీ 22 వేలు కాగా, ఈ టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులకూ కలిపి కేవలం 6227 టికెట్లు మాత్రమే అమ్ముడు పోయినట్టు

తెలిపారు. ఐదు రోజులకూ కలిపి టికెట్లు కొన్నవారి సంఖ్యా 831 మాత్రమే ఉందన్నారు. రోజు వారీ గా అమ్ముడు పోయిన టికెట్లు వివరాలు: మొదటి రోజు అమ్ముడు పోయిన టికెట్లు :4029 ,

రెండవ రోజు అమ్ముడు పోయిన టికెట్లు :568 , మూడవ రోజు అమ్ముడు పోయిన టికెట్లు :360, నాల్గవ రోజు అమ్ముడు పోయిన టికెట్లు :234 , ఆఖరు రోజు అమ్ముడు పోయిన టికెట్లు :141 .    

 

ట్రాఫిక్ నిబంధనలు ఉండవు: సీపీ మీనా

మ్యాచ్ జరుగుతున్న రోజుల్లో జాతీయ రహదారిపై గానీ, నగర పరిధిలో గానీ ఎటువంటి ట్రాఫిక్ నిబంధనలు ఉండవని నగర పోలీసు

కమిషనర్ ఆర్ కె మీనా తెలిపారు. కేవలం ఇరు జట్ల సభ్యులు వెళ్ళినప్పుడు, విఐపిలు వెళ్ళినప్పుడు ట్రాఫిక్ ను ఒక్క సారి ఆపడం  à°®à°¿à°¨à°¹à°¾ ఎటువంటి నిబంధనలు లేవన్నారు. à°ˆ

మ్యాచ్ భద్రతా కోసం 900 మంది పోలీసు సిబ్బంది విధులు నియమించామని తెలిపారు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన విఐపిలు, ప్రేక్షకులు, మీడియా వారికి ప్రత్యేక పార్కింగ్

ప్రాంతాలను కేటాయించామన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam