DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉద్యోగం చేసేది ప్రజా సేవకే అనే భావన రావాలి.:

కొత్త నియామకాల అభ్యర్థులకు ముఖ్యమంత్రి సూచన.

గ్రామా సచివాలయ నియామక పత్రములు అందించి వైఎస్ జగన్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . .

.

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) : అధికారం చెలాయించడం కోసం ఉద్యోగం చేయడం లేదు.. సేవ చేయడం కోసమే à°ˆ ఉద్యోగం చేస్తున్నాం అనే విషయాన్ని ప్రతీ గ్రామ,

వార్డు సచివాలయ ఉద్యోగి గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గ్రామ వాలంటీర్లతో అనుసంధానమై ప్రతీ పేదవాడికి పారదర్శకంగా

ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని విఙ్ఞప్తి చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2à°µ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం

తెలిసిందే. à°‡à°‚దులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో అర్హత సాధించి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తై ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆయన సోమవారం

నియామక పత్రాలు అందజేశారు. విజయవాడలోని ఏప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి సీఎం జగన్‌ సహా మంత్రులు మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి

రామచంద్రారెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, తదితరులు హాజరయ్యారు.

à°ˆ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన చెల్లెమ్మలు,

తమ్ముళ్లకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర చరిత్రలోనే కాకుండా బహుశా దేశ చరిత్రలో కూడా అత్యంత తక్కువ సమయంలో.. అత్యంత పారదర్శకంగా ఏకంగా

ఇరవై లక్షల మందికి పైగా ఉద్యోగాల కోసం పరీక్షలు రాయడం, ఎనిమిది రోజుల పాటు పరీక్షలు జరగడం, లక్షా నలభై వేల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావడం.. ఇది నిజంగా ఓ

రికార్డు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం. ప్రతీ రెండు వేల జనాభాకు సచివాలయం పెట్టడం.. తద్వారా పది నుంచి పన్నెండు ఉద్యోగాలు ఇవ్వడం అంటే

ఉజ్జాయింపుగా ప్రతీ గ్రామానికి పది నుంచి పన్నెండు ఉద్యోగాలు ఇవ్వగలిగామని సగర్వంగా చెబుతున్నా. ప్రతీ యాభై ఇళ్లకు à°’à°• వాలంటీర్‌ ఉద్యోగం కూడా ఇచ్చాము.

ఉద్యోగాల చరిత్రలో ఇదో సరికొత్త రికార్డు అని పేర్కొన్నారు.

సరికొత్త రికార్డు నెలకొల్పిన సీఎం జగన్‌
ఈ తరం యువతరానికి ఉన్న జీవితకాల లక్ష్యంగా మారింది

ప్రభుత్వోద్యోగం. నాటి స్వాతంత్ర ఉద్యమం నుంచి ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు అన్నింటి వెనుక ఉన్న బలమైన నినాదం కూడా అదే. ఏ ప్రభుత్వమైనా సరే శాశ్వత

ఉద్యోగాలు కల్పించి ఉపాధి మార్గం చూపించాలని ప్రజలు నిత్యం కోరుకుంటారు. తెలంగాణ ఉద్యమం ప్రధాన నినాదాల్లో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నవి అత్యంత కీలకమైన్న

విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో యువత ఉద్యమ బాట పట్టింది కూడా ఉద్యోగాల కోసమే. ఒక్క తెలంగాణ ఉద్యమమే కాదు...అన్ని రాష్ట్రాల్లోనూ ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం

విప్లవ పార్టీల నుంచి విద్యార్థి సంఘాల వరకు నిత్యం పోరాటాలు చేస్తునే ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎలాంటి ఉద్యమాలు జరగకుండానే రికార్డు స్థాయిలో

శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రికార్డు నెలకొల్పారు. పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నాడు తాను చెప్పిన మాటను అక్షర

సత్యం చేసి అక్టోబర్‌ 2 నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి చూపిస్తున్నారు. తెలుగునేలపై సరికొత్త ఉద్యోగ విప్లవాన్ని సృష్టించి... అనతికాలంలోనే లక్షా 26

వేల 728 ఉద్యోగాలిచ్చిన ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. ప్రస్తుతం భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి సాధ్యం కాని విషయాన్ని సుసాధ్యం చేసి చూపించి తాను ప్రజల

మనిషి అని మరోసారి చాటుకున్నారు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇన్ని ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవన్నది

గమనార్హం.
ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌... ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అత్యంత

ప్రతిష్టాత్మకంగా.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 11 వేల 158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తోంది. అదే విధంగా 110 మున్సిపాలిటీల్లో 3,809 వార్డు సచివాలయాలను ఏర్పాటు

చేస్తున్నారు. à°ˆ వ్యవస్థలో పనిచేయడానికి 95 వేల 88 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు, 33వేల 581 à°®à°‚ది వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. ఒక్కో సచివాలయంలో 10

మంది ఉద్యోగులు పనిచేస్తారు. అంతేగాకుండా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని

నిర్ణయించింది. ఉద్యోగి సొంత మండలంలో మరే గ్రామమైనా.. జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. అదే విధంగా పోస్టింగ్‌ కోసం సొంత

జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam