DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉదయ్ - విజయవాడ నుంచి విశాఖ వరకూ నాన్ ఏసీ యే 

à°ˆ  à°‰à°¦à°¯à± ఎక్స్ ప్రెస్ కు అన్నీ అవశిష్టాలే. . .

ఏసీ పని చెయ్యడం లేదని ఫిర్యాదు ఇస్తే పట్టింపే లేదు  

ఏసీ ప్లాంట్ లో గ్యాస్ లేదని దువ్వాడలో తేల్చారు.

 

విశాఖ ఏసీ రైళ్లలో ఏసీ కంప్లైంట్ లే ఎక్కువ. . .:

ఏలూరు నుంచీ ఫిర్యాదు . . పట్టింపు లేదు:

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 30, 2019

(డిఎన్‌ఎస్‌) : విజయవాడ - విశాఖ పట్నం మధ్య అట్టహాసంగా ప్రారంభించిన ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైల్లో ఏసీ పనిచేయక ప్రయాణీకులు విలవిలలాడిపోయారు. సోమవారం సాయంత్రం 5 :30 గంటలకు

విజయవాడ నుంచి  à°¬à°¯à°²à± దేరిన  (రైలు నెంబర్ 22702 ) దగ్గర నుంచీ సి 2 కోచ్ లో ఏసీ పనిచేయక పోవడం తో పలువురు ప్రయాణీకులు పదేపదే ఆన్ లైన్ లో రైల్వే విభాగానికి ఫిర్యాదు చేశారు.

ఏలూరు లో ఏసీ మరమ్మత్తు చేస్తారేమో నని ఎదురు చూసారు. అయితే కనీసం స్పందించే నాధుడే కరువయ్యాడు. మొత్తానికి దువ్వాడ చేరుకునే సరికి  à°°à°¾à°¤à±à°°à°¿ 10 :45 గంటలకు à°’à°• ఏసీ

టెక్నీషియన్ వచ్చి చూసి, ఏసీ ప్లాంట్ లో తగినంత గ్యాస్ లేనందునే సి 2 కోచ్ లో ఏసీ పనిచెయ్యడం లేదని తేల్చి చెప్పేసారు. ఈలోగా రైలు విశాఖ చేరుకుంది. మొత్తానికి ఈ

కోచ్ లోని ప్రయాణీకులు పూర్తి ఏసీ రైలు లో నాన్ ఏసీ ప్రయాణం చేసారు. 

ఏలూరు నుంచీ ఫిర్యాదు . . పట్టింపు లేదు:

ఏసీ పని చెయ్యక, ఫ్యాన్ లు లేక, తలుపులు మూసేసిన

బోగీలో ఉడికి, ముచ్చెమటలు పడుతుంటే తట్టుకోలేక ఆన్ లైన్ ద్వారా పలుమార్లు రైల్వే విభాగానికి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడే లేడు. మహిళలు, వృద్దులు, పిల్లలు,

గర్భిణీ స్టీలు ఉన్న నానా అవస్థలు పడ్డారు. 

ఈ రైలుకు ఆది లోనే హంసపాదు ఎదురయ్యింది. ఈ రైలు పట్టాలెక్కి రెండురోజులు కాక ముందే సాంకేతిక ఇబ్బందులు తలెత్తి,

ప్రయాణీకులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. ఈ రైలు కు జండా ఒప్పందమే నెల రోజులు వాయిదా పడింది, పైగా సీటింగ్ విధానం కూడా కొంత ఇబ్బంది కరంగానే ఉంది. ముందుగా

చెప్పినట్టు పూర్తి టికెట్ కొన్న ప్రయాణీకులకు, మంచినీరు ఉచితంగా సరఫరా ఉంటుంది అనే ప్రకటనకు సాకార రూపం కనపడడం లేదని ప్రయాణీకులు

మండిపడుతున్నారు. 

విశాఖ ఏసీ రైళ్లలో ఏసీ కంప్లైంట్ లే ఎక్కువ. . .:

విశాఖ నుంచి బయలు దేరే రైళ్లలో అధిక శతం ఏసీ రైల్లో ఏసీ పనిచేయక పోవడం అనేది సర్వ

సాధారణంగా మారిపోయింది. విశాఖ నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్ ప్రెస్ లో ప్రతి రోజూ ఇదే ఫిర్యాదు దర్శనమిస్తోంది. ఈ రైలు ను ప్రయాణీకులు రాజమహేంద్రవరం రైల్వే

స్టేషన్ లో బలవంతంగా నిలిపేసిన రోజులు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఉదయ్ ఎక్స్ ప్రెస్ . దీనికీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏసీ రైళ్లల్లో సాంకేతిక నిపుణుల

అందుబాటు లేకపోవడం పెద్ద డ్రాబ్యాక్ . 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam