DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సిసిఎల్‌ఏగా సీనియర్‌ ఐఎఎస్‌ ఆదిత్యనాద్‌ దాస్‌ !!!

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి, అక్టోబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : సిసిఎల్‌ఏగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌

రిటైర్డు కాబోతున్న నేపధ్యంలో సిఎం జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ఇరిగేషన్‌ శాఖాదిపతిగా బాధ్యతలు

నిర్వహిస్తున్న ఆదిత్యనాద్‌ దాస్‌ను నియమించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతే కాకుండా ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

ఎల్వీ.సుబ్రహ్మణ్యం ఏప్రిల్‌ మాసాంతానికి రిటైర్డు కాబోతున్నారు. ఆయన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాద్‌ దాస్‌ను సిఎం జగన్మోహనరెడ్డి నియమించటం

ఖాయమంటున్నారు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు. 

ఐఎఎస్‌ అధికారిగా సర్వీసు ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఆయన వివిధ శాఖలలో అనేక హోదాలలో పనిచేసి ప్రత్యేక ప్రధాన

కార్యదర్శి హోదాకు చేరుకున్నప్పటికీ ఆయనను కలిసేందుకు రిటైర్డు అయిన ఉద్యోగులు, సర్వీసులో ఉన్న ఉద్యోగులు ఇప్పటికీ జిల్లాల నుండి వస్తుంటారు. ఆదిత్యనాద్‌

దాస్‌తో కలిసి పనిచేసిన కింది స్థాయి ఉద్యోగులు ఆయనను ఆపద్భాందవుడుగా చేబుతూ ఉంటారు. 

దివంతగ నేత వైఎస్సార్‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఆయన

ఇరిగేషన్‌ శాఖాదిపతిగా బాధ్యతలు నిర్వహించి తనదైన ముద్ర వేశారు. à°ˆ నేపధ్యంలో వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహుతడైన ఆదిత్యనాద్‌ దాస్‌ను సిసిఎల్‌à°—à°¾, à°† తర్వాత

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రి నియమించటం ఖాయమని తెలిసింది. తండ్రి వైఎస్సార్‌కు సన్నిహితులైన ఐఎఎస్‌ అధికారులకు అత్యంత ప్రాధాన్యత, కీలక

ప్రాధాన్యత పోస్టులలో వారిని నియమిస్తున్నారు. à°ˆ నేపధ్యంలో ఆదిత్యనాద్‌ దాస్‌ సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి

భావిస్తున్నట్లు తెలిసింది..

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam