DNS Media | Latest News, Breaking News And Update In Telugu

3 నుంచి బ్యాంకుల ఋణ మేళా : ఆంధ్రాబ్యాంక్ సిజిఎం

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి, అక్టోబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత ప్రభుత్వం ఆదేశాలు అనుసరించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందిస్తున్న

సేవలు, ఋణ పధకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈనెల3, 4 తేదీల్లో ఖాతాదారుల సేవా మహోత్సవం, ఋణమేళా నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల

సమితి కన్వీనర్, ఆంధ్రాబ్యాంక్ అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ కె. నాంచారయ్య పేర్కొన్నారు. à°¤à±‚ర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆంధ్రాబ్యాంక్ ప్రధాన శాఖ లో ఆయన

విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచనల మేరకు దేశ వ్యాప్తంగా400 జిల్లాలో 2 దశల్లో నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిదశలో తూర్పు గోదావరి

లీడ్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్ ఆధ్వర్యంలో అన్ని బ్యాంకుల సహకారంతో రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రం లో ఈకార్యక్రమం జరుగుతుందని తెలిపారు. బ్యాంకులు అందించే

అన్ని ఆర్థిక సేవలు, ఋణ పధకాలు, వివారిస్తామన్నారు. ఖాతాదారుల అర్హత అనుసరించి ముద్ర, స్థాన్డ్ ఆఫ్ ఇండియా, పీఎంఈజిపి, గృహ, వస్తు,వాహన, వ్యవసాయ, చిన్న పరిశ్రమ ఋణాలు

త్వరితగతిన మంజూరు చేయడానికి ఆదేశాలు జారీచేశామన్నారు. ఈ అవకాశం అర్హులైన ఖాతాదారులు వినియగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ కన్వీనర్

ఆంధ్రాబ్యాంక్ జోనల్ మేనేజర్ కె వి ఎస్ రామమోహన రావు,స్టేట్ బ్యాంక్ ఆర్ ఎమ్ డి రాజా రామమోహన రావు, సిండికేట్ బ్యాంక్ ఆర్ ఎమ్.టి వి కె మోహన్, లీడ్ బ్యాంక్ మేనేజర్

జె. షణ్ముఖరావు, జిల్లాలోని అన్ని బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam