DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాల్ బహదూర్ శాస్త్రి లా జీవించే సాహసం చెయ్యగలరా ?

జై కిసాన్ - జై జవాన్ అన్న మొదటి వ్యక్తి ఈయనే.

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . ..

విశాఖపట్నం, అక్టోబర్ 02, 2019 (డిఎన్‌ఎస్‌):  à°°à°¾à°œà°•à±€à°¯à°¾à°²à± అంటే à°’à°• హుందాతనం, à°’à°•

మార్గదర్శకం, ఒక దిశా నిర్దేశం, ఒక త్యాగం, ఇదంతా గతం. అయితే ఇప్పుడు రాజకీయం అంటే ఒక హోదా, ఒక భూ దందా కి బ్రాండ్ అంబాసిడర్, లంచాలకు లాల్ సవారీ, జనం జీవితాలతో

చెలగాటం à°—à°¾ మారిపోయింది. à°¸à°šà±à°›à±€à°² రాజకీయాలకు మారుపేరుగా నిలిచినా లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయులకు, నేటి రాజకీయ నేతలకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

ఉంది అన్నది వాస్తవం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాన మంత్రి గా ఉండి దేశ ప్రజల్లో అత్యంత గౌరవం ఉన్న వ్యక్తి. అయినప్పటికీ కనీసం ఒక సొంత

ఇల్లు కూడా లేదు, పైగా బ్యాంకు ఋణం ఇస్తామన్న కట్టే స్థాయి లేదని సున్నితంగా తిరస్కరించిన వ్యక్తి. ( ఇది అయన ప్రధానిగా ఉండగానే.). అయన కుమారుడి కి ఉద్యోగం లో

పదోన్నతి ఇస్తే ఉద్యోగం మానిపించిన వ్యక్తి ఈయన. ప్రధాని కుమారుడు కనుక అతనికి పదోన్నతి కల్పించారు, తర్వాత ఎదో ఒక పని కోసం వస్తారు అని ముందుగానే కుమారుణ్ణి

హెచ్చరించిన గుణశీలి. పైగా అయన సంపాదించిన ఆస్థి కూడా ఏమీ లేదు. అధమపక్షం కనీసం ఒక సొంత కారు కూడా కొనుక్కోలేకపోయారు, ఇది కేవలం ఆయన నిజాయితీ కి తార్కాణం. ఆయన

సాధారణ పౌరునిగా ఎలా జీవనం సాగించారో భారత దేశ ప్రధానిగా ఉండగా కూడా అదే విధంగా జీవనాన్ని కొనసాగించారు. ఇది దేశ ప్రజలందరికీ ఆదర్శ వంతంగా మారింది.

అయితే

నేటి రాజకీయ నేతలో . . ఒక గ్రామ పంచాయితీలో వార్డు సభ్యుడు కూడా ఇన్నోవా కార్లు లేనిదే ఇంటి గుమ్మం దాటడు. పైగా ప్రతీ బ్యాంకు లోనూ అప్పులే అప్పులు, భూ దందాలు, ప్రతీ

పనిలోనూ లంచాల్లో వాటాలు, సాయంత్రం సిట్టింగులూ, ఉదయం బెట్టింగులు, ఇలా ఒక్కటేంటి , అన్నింటా ముందంజే. ఇతని స్థాయి లోని వ్యక్తే ఇలా ఉంటె ఒక ఎమ్మెల్యే ఎలా ఉంటాడు ?

ఎంపీ ఎలా ఉంటాడు? ఇక రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు ఏ స్థాయిలో జీవితాన్ని గడుపుతున్నారో దేశ ప్రజలంతా చూస్తూనే ఉన్నారు.

ప్రతీ కేసులోనూ ఒక ప్రజా ప్రతినిధి లేదా, వాళ్ళ అనుచరులు.... ముద్దాయిలుగానే ఉంటున్నారు. గతంలో ఐటీ శాఖకి, ఈడీ విభాగం లో ఎవరికీ పెద్దగా పనిలేక ఖాళీగా ఉండేవారు. మరి

ఇప్పడి నాయకుల ఘనకార్యం వల్ల ఈ విభాగాలకు ఖాళీ లేకుండా అధిక పనిభారం కూడా పడిపోయింది.

జై జవాన్ - జై కిసాన్ నినాదం తో దేశం లో సంచలనం సృష్టించి, భారత దేశం

సుభిక్షంగా ఉండాలి అని నినాదంతో సంచలనం సృష్టించారు. అంటే దేశం బయట సైనికుడు ఎండననక, రాత్రిననక శత్రు సైనికులను నుంచి రక్షిస్తున్నారని, దేశం లోపల రైతులు

శ్రమించి పంటలు పండించి దేశ ప్రజలు పౌష్టికాహారాన్ని ఇస్తున్నారని, వీరందరి శ్రమను గౌరవించవలసిన అవసరం ప్రతి భారతీయునికి ఉందని, జై జవాన్ - జై కిసాన్ నినాదాన్ని

విస్తృతం చేశారు.

లాల్ బహదూర్ శాస్త్రి లాంటి సామాన్య జీవితం గడపగలిగే ధైర్యం ప్రస్తుత నేతలు చెయ్యగలరా అంటే అతిశయోక్తే అవుతుంది. కనీసం కలలో కూడా వీళ్ళకి

ఆ ఆలోచన కూడా చెయ్యలేరన్నది వాస్తవం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam