DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు నయ వంచకుడు, ఆంధ్ర జాతి ద్రోహి... : కన్నా లక్ష్మీనారాయణ

రాష్ట్రంలో ప్రతీ ఇంటా సహాయ జెండా ఎగరేలా ప్రచారం చేస్తాం,

2019 ఎన్నికల గెలుపే లక్ష్యం., ఆషాఢభూతులను నమ్మొద్దు : కన్నా లక్ష్మీనారాయణ

బిజెపి ఆంధ్ర

అధ్యక్షులు గా అధికారికం గా భాద్యతలు స్వీకరణ

విజయవాడ, జూన్ 3, 2018 (DNS Online) : అతి త్వరలో 2019లో జరుగనున్నఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పని చేస్తానని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర

భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం విజయవాడ పార్టీ అధ్యక్ష్య కార్యాలయం లో అయన అధికారికంగా పార్టీ భాద్యతలను స్వీకరించారు. ఈ

సందర్బంగా మాట్లాడుతూ దీనిలో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతీ గ్రామం లోనూ ఇంటింటా బీజేపీ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. ప్రతీ ఇంటికి

వెళ్లి, బీజేపీ ఆంధ్ర కు చేసిన మేలు, ఇచ్చిన నిధులు వివరిస్తామన్నారు. నాలుగేళ్ల పాలనలో మోడి అవినీతి రహిత పాలన సాగించి అందరికి ఆదర్శంగా నిలిచారని, 156 సంక్షేమ

పధకాలను మోడి అమలు చేసి.. అన్ని వర్గాల వారికి చేయూతను ఇచ్చారన్నారు. పార్టి అభివృద్ధి కి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.

నయవంచకుడు చంద్రబాబు : . ..

.

కేంద్రం నుంచి పొందవలసిన నిధులు, ప్రోజక్టులు అన్నీ పొందిన చంద్ర బాబు, వాటి లెక్కలు అడిగితె బీజేపీని తిడుతూ అసత్య ప్రచారం చేస్తున్నదన్నారు. కేటాయించిన

నిధులు తెలుగుదేశం ముఠా తమ స్వార్ధానికి వాడుకుంటే అడ్డుకట్ట వెయ్యాలనుకోడమే బీజేపీ చేసిన నేరంగా భావించారన్నారు. నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలు, వెన్నుపోట

పదాలకు నిలువెత్తు నిదర్శనమే చంద్రబాబు నాయుడని అన్నారు.

గత ఎన్నికల్లో తెలుగుదేశం ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, పేదలకు ఇల్లు,

దళితులకు భూమి ఇవ్వకపోవడం, కాపు రిజర్వేషన్ వంటి హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం చంద్రబాబు నైజానికి నిదర్శనమన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం

చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

మూడు దీక్షలలో కాంగ్రెస్ ను తప్పుబట్టిన చంద్రబాబు ఈ దీక్షలో బాబు తన నిజరూపాన్ని బయట

పెట్టుకున్నారు

కాంగ్రెస్ పార్టీ అద్దె మైకే ఈ చంద్రబాబు....

కేవలం తన కుటుంబ స్వార్ధం కోసమే పని చేసే చంద్రబాబు, ఇప్పుడు గతిలేని స్థితి లో కాంగ్రెస్

పార్టీకి అద్దె మైకులా తయారయ్యాడన్నారు. ప్రజా క్షేత్రం లో ఏనాడు ఒంటరిగా పోటీ చెయ్యడం చేతగాని తెలుగుదేశం గతం లో రెండు సార్లు ఎన్డీఏ తో కలిసి పోటీచేసి, తన

కోర్కెలు నెరవేరిన తర్వాత వాళ్ళకే గోతులు త్రవ్విన ఆషాఢభూతి చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం, దమ్ము లేని చంద్రబాబు, మరో గతి లేక, తమ బద్ద

శత్రువైన కాంగ్రెస్ తోనే జతకట్టేందుకు సిద్దపడ్డాడన్నారు. ఈ చర్య తెలుగుదేశం వ్యవస్తాపకుడు ఎన్టీఆర్ కు మరో మారు ఆత్మక్షోభ కల్గింస్తుందన్నారు. మధ్యలో వామ

పక్షాలతో కలిసి పోటీ చేసి, విద్యుత్ చార్జీలు ఎందుకు పెంచారు అని ప్రశ్నించిన వామ పక్ష కార్మికులపైనే బషీర్ బాగ్ లో పోలీసులతో కాల్పులు జరిపించిన నయవంచకుడు ఈ

చంద్రబాబే నన్నారు. ఆ మరణించిన అమాయకుల కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పుడు రాహుల్ గాందీ ప్రాపకం కోసం మోడి, షా లను విమర్శిస్తున్నాడని

మండిపడ్డారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam