DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనవరి 1 నుంచి పూర్తిస్థాయి లో గ్రామ సచివాలయాలు 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 

35 శాఖల ద్వారా 550 తరహాల సేవలు andubatuloki 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . .  .

అమరావతి,  à°…క్టోబర్ 02, 2019

(డిఎన్‌ఎస్‌): రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన గ్రామ సచివాలయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ

సమీపంలోని కరప గ్రామం లో ప్రారంభించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ జనవరి 1 , 2020 నుంచి పూర్తి స్థాయిలో ఈ కార్యాలయాలు కార్యాచరణ చేపడతాయని

తెలిపారు. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ఈ సంస్థలు సేవలందిస్తాయన్నారు. సుమారు 35 ప్రభుత్వ శాఖల ద్వారా 550 తరహాల ప్రజా సంక్షేమ సేవలను అందించనున్నాయి. ఈ కార్యాలయ ద్వారా

ప్రజలు రేషన్ కార్డులు, పెన్షన్లు, ఆరోగ్య శ్రీ కార్డులు తదితర అత్యవసర వసతులను 72 గంటల లోపు పొందవచ్చన్నారు. రికార్డు స్థాయిలో రాష్ట్ర చరిత్రలోనే కేవలం 4 నెలల

కాలంలో 4 లక్షల ఉద్యోగాల నియామకాలను చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 3 ఏళ్ళ పరిమితి కాలం లో 44 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని

ముఖ్యమంత్రి తెలిపారు. ఏడాదికి 15 వేల పాఠశాలలకు ఈ వసతులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి జిల్లాలోని ఆసుపత్రులనూ పూర్తిస్థాయి లో వైద్య సదుపాయం లభించే

విధంగా అభివృద్ధి పరుస్తామన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° వ్యాప్తంగా 43 వేల బెల్ట్ దుకాణాలను అదుపు చేయగలిగామని, మద్యం నియంత్రణ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వమే మద్యం దుకాణాలను

నడుపుతోందని తెలిపారు.  

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ పాదయాత్రలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన

హామీని నిలబెట్టుకున్న ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కె దక్కుతుందన్నారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్ర  à°¬à±‹à°¸à± మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచి,

రైతాంగానికి ఆర్థిక పుష్టి కల్పించే విధంగా à°ˆ ప్రభుత్వం బృహత్తర పధకం రైతు భరోసా ను తీసుకువచ్చిందన్నారు. అంతకు ముందు వేదిక పై ఉన్న గాంధీ,  à°…ంబెడ్కర్, లాల్

బహదూర్ శాస్త్రి, వైస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు ముఖ్యమంత్రి నివాళి అర్పించారు. 

అనంతరం సభా ప్రాంగణం లో ఏర్పాటు చేసిన వివిధ విభాగాల స్టాల్స్ ను

ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు సందర్శించారు. 
à°ˆ సభలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, పినేపి  à°µà°¿à°¶à±à°µà°°à±‚ప్ , ఎంపీ లు వంగ  à°—ీత , à°šà°¿à°‚à°¤ అనురాధ , à°Žà°‚ భారత్,

పంచాయితీ రాజ్ శాఖా ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వేవేది, పంచాయితీ రాజ్ కమిషనర్ à°—à°¿à°°à°¿à°œ శంకర్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ à°¡à°¿  à°®à±à°°à°³à±€à°§à°°à± రెడ్డి తదితరులు

పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం : . . .  

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామం విచ్చేసిన సందర్భంగా ఆ

గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రి కి ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.స్వాగతం పలికినవారిలో ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూశాఖ మంత్రి పిల్లి

సుబోస్ చంద్ర బోస్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భారత్ రామ్,

కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగ గీత, అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింత అనురాధ, కాకినాడ శాసన సభ్యులు డి.చంద్రశేఖర్ రెడ్డి, కొత్తపేట శాసనస భ్యులు చిర్ల

జగ్గిరెడ్డి, రాజానగరం శాసన సభ్యులు మరియు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, పిఠాపురం శాసన సభ్యులు పెండ్యామ్ దొరబాబు, రామచంద్రపురం శాసన సభ్యులు

వేణు గోపాల కృష్ణ, పి.గన్నవరం శాసనస భ్యులు కె.చిట్టి బాబు, అనపర్తి శాసన సభ్యులు సూర్యనారాయణ రెడ్డి, ఏలూరు డి.ఐ.జి - ఏ.కె.ఖాన్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్

డి.మురళీధర్ రెడ్డి, ఎస్.పి నయీమ్ హస్మి, ఆర్.డి.ఓ చిన్నికృష్ణ, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎమ్. ఫ్రాన్సిస్ తదితరులు ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన వారిలో

ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam