DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశాభివృద్ధి ని బలోపేతం చెయ్యడంలో బ్యాంకుల పాత్ర కీలకం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌) : దేశం లోని వివిధ బ్యాంకులు రైతులకు రుణాలు, మహిళలు, నిరుద్యోగులకు ఆసరాగా

నిలబడి దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నారాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సంయోజకులు కె వి నాంచారయ్య అభిప్రాయపడ్డారు. గురువారం తూర్పు గోదావరి

జిల్లా రాజమహేంద్రవరం లోని వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో దేశ స్థాయి బ్యాంకర్లు, బ్యాంకు ఖాతాదారుల సేవమహోత్సవ కార్యక్రమం లో అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆర్ధిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి నిరుద్యోగ యువతకు వారి అర్హతలను బట్టి రుణాలు అందిస్తూ పారిశ్రామిక రంగాన్ని విస్తృత

పరిచే ప్రక్రియలో ప్రధాన భూమిక బ్యాంకులదేనన్నారు. గతం లో కాకుండా ప్రజల వద్దకే బ్యాంకు అధికారులు వచ్చే విధంగా చర్యలు చేపట్టి మహిళలు ఇంటి వద్దనే ఉంది ఆర్ధిక

స్వావలంబన సాధించే విధంగా యువత నూతన పరిశ్రమలు ఏర్పాట్లు చేసి అభివృద్ధి చెందే విధంగా నిరుద్యోగులు వారికీ ఉన్న అర్హతలు, నైపుణ్యం తో ఆయారాంగాల్లో రాణించే

విధంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా గృహ నిర్మాణం, వ్యక్తిగత రుణాలు, విద్య రుణాలు, విదేశీ విద్యా రుణాలు తదితర అంశాలు కేవలం బ్యాంకులు మాత్రమే

ఇవ్వగలవన్నారు. 

ఈ కార్యక్రమం లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, డిజిఎం ఎస్. గిరిధర్, బ్యాంకు అఫ్ బరోడా ఆర్ ఎం శైలేంద్ర సింగ్, బ్యాంకు ఆర్ ఎం మల్లిఖార్జున రావు,

సిండికేట్ బ్యాంకు ఆర్ ఎం బివి కృష్ణ మోహన్, ఐ ఓ బి సుజాత, డిసిసిబి సి ఈ ఓ ఎం. విద్యాధర రావు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు అధికారి షణ్ముఖ రావు, కెనరా బ్యాంకు జి ఎం

ప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam