DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ సాయం లేకున్నా షెల్టార్లు నిర్వహించాలి : మంత్రి బొత్స 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌) : నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంలో ప్రభుత్వం సహకారం లేకుండానే సొంతంగా

నిర్వహించుకునే స్థాయికి ఎదగాలని స్వచ్చంద సంస్థలు ఎదగాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం విజయవాడ లోని ఓ సమావేశ

మందిరం లో పురపాలక శాఖా నిర్వహించిన సమీక్షా సమావేశంలో అయన మాట్లాడుతూ పట్టణాల్లో నిర్వహిస్తున్న నిరాశ్రయుల ఆవాసం ( షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్ లెస్) పరిస్థితులను

అధ్యయనం చేసేందుకు ఆరుగురు సభ్యులతో à°’à°• కమిటీ నియమిస్తున్నట్టు తెలిపారు. 

పట్టణాలలో నిరాశ్రయులకు వసతి కల్పించే అంశం పై ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని

వేసి దాని నివేదిక ఆధారంగా చర్యలు టీసుకోవడం జరుగుతుందన్నారు. ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు అధికారులు, ముగ్గురు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు ఉంటారన్నారు. ఈ

కమిటీ 15 రోజుల్లో నుంచి నెల రోజుల్లోగా నివేదిక సమర్పిస్తుందన్నారు.  à°ˆ కమిటీ స్వచ్చంద సంస్థ లు పడుతున్న సాధక బాధలు, ఏ పట్టణంలో ఎంతమంది  à° పట్టణం లో ఆశ్రయం

పొందుతున్నారో పూర్తిగా చర్చించడం జరుగుతుందన్నారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంలో ప్రభుత్వం సహకారం లేకుండానే సొంతంగా నిర్వహించుకునే స్థాయికి ఎదగాలని

సూచించారు. రానున్న ఐదేళ్ల తర్వాత ప్రభుత్వ సాయం ఆశించడం సబబు కాదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నిరాశ్రయ ఆసరాలు, అందులో నివాసం ఉన్న సభ్యులు తదితర అంశాలపై

ఆరా తీశారు. 

ఈ సమావేశంలో మెప్మా అదనపు సంచాలకులు శివ పార్వతి, పురపాలక శాఖా కమిషనర్ జి. విజయ్ కుమార్, ఇతర అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam