DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాటన్ బేరేజి వద్ద మూడు మృత దేహాలు లభ్యం. .

పడవ ప్రమాదంలో బాధితులుగా అనుమానం. 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°…క్టోబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం

వద్ద కచ్ఛులురు వద్ద గత నెల 15 న గోదావరి నదిలో మునిగిన రాయల్ వస్తిష్ఠ పాపికొండల పర్యాటక పడవ ప్రమాదం లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. కొందరు

ప్రాణాలతో బయటపడగా, మరికొందరు విగత జీవులుగా ఒడ్డుకు చేరారు.  à°®à°°à°¿ కొన్ని మృత దేహాలు బయట పడవలసి ఉండగా శుక్రవారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు మూడు మృతదేహాలు

గోదావరిలో వచ్చాయి. ఈ మృతదేహాలు దేవీపట్నం బోటు ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలు గా అనుమానిస్తున్నారు. వీటిని గమనించిన స్థానికులు పోలీసు అధికారులకు సమాచారం

ఇవ్వగా వీటిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించేందుకు మృతదేహాలను బయటకు తీస్తున్న పోలీస్ అధికారులు. అయితే మునిగిపోయిన ఈ

పడవను బయటకు తీసే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. à°ˆ ప్రమాదం లో మరణించిన వారికీ రాష్ట్ర ప్రభుత్వం  à°°à±‚. 10 లక్షలు ప్రకటించగా, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ బీమా

సంస్థ వారు మరో రూ. 10 లక్షలు అందించారు. అయితే తీవ్ర గాయాల పాలైన వారికీ రూ. 3 లక్షలు, సురక్షితంగా బయట పడిన వారికీ రూ. 1 లక్ష నష్ట పరిహారం ఇస్తున్నట్టు రాష్ట్ర

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా బయట పడని మృత దేహాల కోసం బంధువులు గోదావరీ తీరం వద్దే ఎదురుచూస్తున్నారు. మరికొందరు మృత

దేహం లభ్యం కానప్పటికీ కర్మకాండలు జరిపించిన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam