DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర సీఎం ప్రచారానికి 25 మంది అవుట్ సోర్సింగ్. రాష్ట్రానికి వరమా లేక భారమా ?

25 మంది అవుట్ సోర్సింగ్ తో బాబు ప్రతిష్ట పెరిగిందా?

ఏటా ఖర్చు కోటిన్నర, సాధించింది సున్నా,  

విశాఖపట్నం, జూన్ 4  2018 ( DNS Online  ) : ఏడాదికి కోటిన్నర రూపాయలు

వెచ్చించి కేవలం ముఖ్యమంత్రికి ప్రచారం కల్పించేందుకు 25 మంది ఔట్ సోర్సింగ్ జర్నలిస్ట్ లను నియమిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా

నిరసనలు à°µà±à°¯à°•à±à°¤à°®à°µà±à°¤à±à°¨à±à°¨à°¾à°¯à°¿. à°—à°¡à°¿à°šà°¿à°¨ 21 నెలల కాలం లో à°ˆ 25 మంది కల్పించిన ప్రచారం తో ఇటు రాష్ట్రం లోనూ, అటు కేంద్రం లోనూ అధికార తెలుగుదేశం పార్టీ పరువు తో పాటు,

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ట కూడా మంటగలిసిపోయిందనే వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. 

ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం

కల్పించడానికి ఏర్పాటు చెయ్యబడినదే సమాచార శాఖ. ఈ శాఖ ద్వారా అనుభవజ్ఞులైన సిబ్బంది తో ఈ శాఖ కొన్ని దశాబ్దాలుగా నిర్వహించబడుతోంది. దాదాపుగా అన్ని జిల్లాల్లో

జరిగే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలనూ ప్రజలకు సత్వరం తీసుకువెళ్లేలా సిబ్బంది అహరహం శ్రమిస్తున్నారు. అయితే వీరిని కాదని, ప్రత్యేకంగా 25 మంది ని అవుట్ సోర్సింగ్

విధానం ద్వారా తీసుకుని, నెలకు 12 లక్షల 86 వేలు ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి కేవలం చంద్రబాబు ( ముఖ్యమంత్రి ప్రచారం పేరుకే ) కి ప్రత్యేకంగా ప్రచారం చేయిస్తున్నారు.

ఒక్కొక్కరికి రూ. 40 వేలు వేతనం, అదనపు అలవెన్సులు రూ. 11 468 కలుపుకుని ప్రతి ఒక్కరికి నెలకు రూ. 51468 చొప్పున అందిస్తూ, 25 మందికి ప్రతి నెల నెలకు రూ. 12,86,700 ఇచ్చే విధంగా రాష్ట్ర

ప్రభుత్వం ఒక జీవో ను విడుదల చేసింది. 2220 అకౌంట్ హెడ్ నుంచి ఈ ఖర్చు చేసేవిధంగా ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఈ జీవో సెప్టెంబర్ 1 , 2016 నుంచి అమలు లోకి వస్తుందని ఆదేశాలు జరీ

అయ్యాయి. పేరుకే ముఖ్యమంత్రి ప్రచారం అని చెప్తున్నా, ప్రభుత్వం డబ్బు తో పూర్తిగా తెలుగుదేశం పార్టీని రానున్న ఎన్నికల్లో అధికారం లోకి తీసుకు రావడానికే

అధికారికంగా నియమించినట్టు సమాచారం. à°…యితే ఏడాదికి à°ˆ ప్రచారం ఖర్చు కోటిన్నర పైగా అవుతుండగా , వీరు సాధించిందేంటో పాలకులకే తెలియాలి. 

వివరం ఇదే. . .

 :

ఏపీ లో సీఎం అధికారిక జర్నలిస్టుల నియామకం పై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్ సంచలనం స్రుస్థించింది. దీని ప్రకారం ఆంధ్ర లో లంచాలు ఇచ్చి

ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ జర్నలిస్ట్ ల చే పార్టీ ప్రచారం చేయించుకుంటోంది అన్నది సారాంశం. ఈ ట్వీట్ 2016 లోనే చేసినప్పటికీ, ఇది అప్పట్లోనే వివాదం గా మారింది. ఈ జీవో

విడుదలయ్యే నాటికి తెలుగుదేశం, బీజేపీ లు మిత్ర పక్షంగానే ఉన్నాయి, అప్పుడు దీనిపై పెద్ద వివాదం తలెత్తలేదు. అయితే ఇప్పుడు ఇరు పార్టీలు బద్ద శత్రువులుగా మారడం

తో à°ˆ అంశం తెరపైకి వచ్చింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియా లో మరో సారి వైరల్ à°—à°¾ మారింది. 

ఇదే వాస్తవం... : 

నిజంగా అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్రంలోనే కాదు,

దేశంలోని మీడియా అంతా ఉచితంగానే ప్రసారం కల్పిస్తారు. వాళ్ళకి జీతాలు, ఆయా మీడియా సంస్థలే ఇస్తాయి, ముఖ్యమంత్రి కార్యాలయం ( అదే ఐ అండ్ పీఆర్ ) ఖాతా నుంచి నెలకు 51

వేల రూపాయలు జీతాలు అప్పనంగా ఇవ్వనక్కరలేదు. ఆ డబ్బులని పత్రికలకు, టీవీ లకు ప్రకటనల రూపం లో ఇస్తే వీళ్ళు మరింత ప్రచారం కల్పిస్తారు. ఇలా ప్రత్యేకంగా 25 మంది సీఎం

ని మోయవలసిన అవసరం ఎందుకు ? పైగా à°ˆ రాష్ట్రం లో సమాచార శాఖ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను మాధ్యమాల ద్వారా ప్రచారం చెయ్యడానికే.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤ పరిస్థితుల్లో

కొన్ని ప్రసార మాధ్యమాలు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నాయంటూ  ( à°“ వర్గం పేరిట)  à°ªà±à°°à°¤à°¿à°ªà°•à±à°·à°¾à°²à± గగ్గోలు పెడుతున్న తరుణం లో à°ˆ విధమైన అవుట్ సోర్సింగ్ నియామకాలు

జరపడం మరింత వివాదం à°—à°¾ మారుతోంది. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam