DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉద్యోగ తొలగింపు కార్మికులకు కేసీఆర్ దసరా కానుక

కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వం జీవితాలకు ఎసరు పెట్టింది. 

ఆర్టీసీ కార్మికులను తొలగింపు దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు.

సీఎల్పీ నేత బట్టి

విక్రమార్క 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°…క్టోబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌) : ఉద్యోగ తొలగింపు తెలంగాణా ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్

దసరా కానుక గా ఇచ్చిన ఘనుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావేనని, తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ పార్టీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం నిర్వహించిన

విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్న సమస్యలు న్యాయబద్ధమైనవని,  à°¦à°¶à°¾à°¬à±à°¦à°¾à°² కాలం నుంచి కాపాడుకుంటున్న ఆర్టీసీని

ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు కోరారన్నారు. 
ఆర్టీసీ నష్టాల్లో ఉంది అనే నెపంతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, ప్రభుత్వం

తీసుకున్న నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాల్లో ఉందన్నారు. 
డీజిల్ పై లీటరుకు 20 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం  à°µà±à°¯à°¾à°Ÿà± à°—à°¾ విడిస్తోందని, డీజిల్ ధర రాష్ట్ర ప్రభుత్వం

పెంచడం వల్ల ఆర్టీసీ పై భారం పెరిగిందని తెలియచేసారు. దాదాపు 50 వేల  à°•à±‹à°Ÿà±à°² ఆస్తులు కలిగి ఉన్న ఆర్టీసీ నేడు నష్టాల బారిన పడటానికి రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనే

కారణం అన్నారు. అట్లాగే ఎలక్ట్రిక్ బస్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి బస్సుకి 50 లక్షల వరకు సబ్సిడీ రావాల్సి ఉండగా వాటి ని రాబట్టడంలో శ్రద్ద చూపని ప్రభుత్వం

వాటి నిర్వహణను ప్రైవేట్ వారికి ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. 
రాష్ట్ర ప్రభుత్వం చేతులో ఉన్న డీజిల్ పై రేట్లు పెంచడంతో ఆర్థిక భారం

పడుతుందని, ఆర్టీసీ 20 కోట్ల లీటర్ల డీజిల్ వాడుతుంది...ఒక్కో లీటర్ పై 20 రూపాయలు పన్ను వేస్తున్నారని తెలిపారు. డీజిల్ వల్ల ఏడాదికి 4వందల కోట్లు ఆర్టీసీ

నష్టపోతోందని, ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్న ఆర్టీసీ కేసీఆర్ పాలన వల్ల కుదేలు అవుతుంది. గత ప్రభుత్వాలు ఆర్టీసీని కాపాడేందుకు ఆర్థిక సాయం చేసాయని వివరించారు.

తెలంగాణ సమాజంలో  à°«à±à°¯à±‚డల్ వ్యవస్థను తలపించే విధంగా కేసీఆర్ పాలన  à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. అనాదిగా వస్తున్న ఆర్టీసీ ఆస్తులను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు

అప్పగించేందుకు కుట్ర జరుగుతుంది. అందులో భాగంగానే నేడు 2600 బస్సులను ప్రైవేట్ వారి ఆధ్వర్యంలో నడుస్తాయని కేసీఆర్ అంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికే వరంగల్ తో

పాటు  à°ªà±à°°à°¾à°‚తాల్లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినట్లు తెలుస్తుందని, కార్మికుల పట్ల కాంగ్రెస్ పార్టీ à°…à°‚à°¡à°—à°¾ ఉంటుందని ప్రకటించారు.  à°¤à±†à°²à°‚గాణ రాష్ట్రానికి

దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు తేడా ఉందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితుల్లో సాదించుకున్నామని, దాన్ని కాపాడుకోవాల్సిన భాద్యత అందరిపైనా

ఉందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చడం సరైన నిర్ణయం కాదు. ఇతర రాష్ట్రాలలో ఆర్టీసీ లేదని తెలంగాణ ఆర్టీసీని మూసివేస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కి

వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి కాదు తెలంగాణ రాష్ట్రం అన్నారు.  5వేల కోట్ల అప్పులను తీర్చలేని కేసీఆర్ . . 6 లక్షల కోట్లు అప్పు మరో మూడేళ్ళలో అవుతుందని. . అలా  à°…ని

రాష్ట్రాన్ని అమ్మేస్తారా? అని ప్రశ్నించారు. 

అట్లాగే కార్మికుల పక్షపాతులం అని చెప్పే సీపీఐ  à°µà°¾à°°à± తమ ఏఐటీయూసీ ద్వారా హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో  à°†à°°à±à°Ÿà±€à°¸à±€

కార్మికులకు ద్రోహం చేస్తున్న తెరాస కు మద్దత్తు ఇస్తోందన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam