DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇసుక అమ్మండి మహాప్రభో : భాజపా భిక్షాటన 

పాలిసీ తో ప్రజలను మభ్యపెట్టారు 

భవన నిర్మాణ కార్మికులను బ్రతికించండి 

వైఎస్ జగన్ హిట్లర్ ను తలపిస్తున్నారు. . .

కార్మికులను దూరంగానే ఉంచారు

 . . .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, అక్టోబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అమ్మకాలు అందుబాటులో లేనందున భవన నిర్మాణ కార్మికులను

బ్రతికించండి మహా ప్రభో అంటూ భారతీయ జనతా పార్టీ నేతలు విశాఖ రోడ్లపై భిక్షాటన చేశారు. సోమవారం ఉదయం విశాఖనగరం లోని గురుద్వారా కూడలి వద్ద బీజేపీ అగ్రనేతలు

మట్టి చిప్పలు పట్టి భిక్షాటన చేసారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా ఇసుక లభ్యంకాక వేలాదిగా భవన నిర్మాణ

కార్మికులు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. గత ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతొ చేసిన కుంభకోణాలతో ఐదేళ్ల పాటు ఈ అమాయక కార్మికులు ఇబ్బంది పడితే. . . నేడు వైఎస్

జగన్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలల కాలంలో ఇసుక విక్రయ విధానం లేకపోవడం తో వేలాదిగా నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. వీళ్ళ ఆవేదన ప్రజలకు తెలియాలని

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు రోడ్లపై భీకరణ చేస్తున్నట్టు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాశీరాజు మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనా హిట్లర్ ను

తలపిస్తోందన్నారు. à°ˆ కార్యక్రమంలో మాజీ ఎంపీ హరిబాబు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాశీరాజు, తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీ నేతలు ఈ భిక్షాటన కార్యక్రమం

ఎవరి కోసం చేస్తున్నారో à°† భవన నిర్మాణ కార్మికులను దూరంగానే పెట్టారు. నేతలందరూ ముందుగా నుంచుని, కార్మికులను మాత్రం అల్లంత దూరంలోనే నిలబెట్టడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam