DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చకుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం . .

దేవాలయాల్లో రాజకీయాలకు తావులేదు

అర్చక సమస్యల పరిష్కారానికై సబ్ కమిటీ ఏర్పాటు 

వారసత్వ అర్చకత్వం కొనసాగించేందుకు చర్యలు  

అర్చకులకు

రిటైర్మెంట్ లేకుండా అర్చకత్వం . . .

ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు సమానంగా హెల్త్ కార్డు 

దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . . .

అమరావతి,  à°…క్టో 09, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాల్లోని అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం

కట్టుబడి ఉందని, వారి సమస్యల పరిష్కారానికై ఉప కమిటీ వేయనున్నట్టు దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో అర్చకులు

ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని అర్చక సమాఖ్య ప్రతినిధులు కలిసిన నేపథ్యంలో చర్చించామని  à°¦à±‡à°µà°¾à°¯à°¦à°¾à°¯ శాఖ మంత్రికి సూచించారు.

à°ˆ మేరకు 
బుధవారం అర్చక సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో అయన మాట్లాడుతూ à°¦à±‡à°µà°¾à°²à°¯ భూములు మరియు ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తామని, అర్చక వారసత్వ హక్కుల

ప్రకారం అర్చకత్వం కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా అర్చకత్వం నిర్వహించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు

తీరును పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. కనీస ఆదాయం లేని దేవాలయాలకు అర్చక గౌరవ వేతనం  5 నుంచి 10 వేలకు పెంచడానికి చర్యలు తీసుకుంటామని,  à°°à±‚. 10,000  à°‰à°¨à±à°¨ భృతిని రూ. 16,500 కు

పెంచుతామన్నారు. ప్రస్తుతం 1600 దేవాలయాల్లో దూపదీప నైవేద్య పథకం అమలవుతోందని, దీన్ని రాష్ట్రవ్యాప్తంగా 3,600 దేవాలయాలకు వర్తించేలా చర్యలు చేపడతామన్నారు.

à°¡à°¿ à°¡à°¿

ఎస్ స్కీమ్ కింద ఇస్తున్న ఐదు వేల రూపాయల వేతనాన్ని 10 వేలకు పెంచేందుకు చర్యలు ఉంటాయని, శాశ్వత ప్రాతిపదిక మీద ధార్మిక పరిషత్తు మరియు అర్చక వెల్ఫేర్ బోర్డు

ఏర్పాటుకు చర్యలు జరుగుతాయన్నారు.

అర్చకులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు సమానంగా హెల్త్ కార్డు అందించి, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పధకాలను అమలు

చేస్తామన్నారు.  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ కమిషనర్ కార్యాలయం సముదాయం లో ఉన్న అర్చక సంక్షేమ భవనాన్ని విస్తరిస్తాం అని అన్నారు. 

దీనికి స్పందిస్తూ జీవో నెంబర్ 76 ను అమలు

చేయాలంటూ మంత్రిని అర్చక సంఘాలు కోరాయి.  à°§à°¾à°°à±à°®à°¿à°• పరిషత్ అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. 

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లం,

దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, కమిషనర్ పద్మ, తిరుపతి జెఈవో బసంత్ కుమార్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణు, అర్చక సమాఖ్య బ్రాహ్మణ సమైక్య

నాయకులతో పాటు పురోహితులు 13 జిల్లాల నుంచి హాజరైన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam