DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమలలో వేడుకగా   'భాగ్‌ సవారి' ఉత్సవం

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, అక్టోబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమలలో బుధ‌వారం సాయంత్రం భాగ్‌సవారి ఉత్సవాన్ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ వేడుకగా

నిర్వహించింది. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తులను తిరుమాడ వీధులలో ఊరేగుతూ అనంతాళ్వారు తోటకు వేంచేశారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు

పూర్తయిన మరుసటిరోజు తిరుమలలో ''భాగ్‌సవారి'' ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా భాగ్‌సవారి ఉత్సవాన్ని నిర్వహించారు. 

పురాణ

ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారు భక్తాగ్రేసరుడైన శ్రీ అనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటటు మానవ

రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలుకోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారులవారు అశ్వత్త వృక్షానికి బందిస్తాడు. స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షిణ దిశలో

పారిపోయి ఆలయంలోనికి ప్రవేశించి మాయమై పోతారు. అనంతరం అనంతాళ్వారులవారు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసింది స్వామివారేనని గ్రహించి పశ్చాతాపడ్డాడు.

వెంటనే అమ్మవారిని బందీ నుండి విముక్తురాలిని చేసి, పూలబుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తుడైన అనంతాళ్వారు భక్తికి మెచ్చి

స్వామివారు బ్రహ్మోత్సవాల మరునాడు అనంతాళ్వారు తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు.

ఈ కార్యక్రమంలో టిటిడి

ఆలయ డెప్యూటీ ఈవో à°¹‌రీంద్ర‌నాధ్‌, విఎస్వో మనోహర్ , ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam