DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చైతన్య పబ్లిక్ స్కూల్లో పర్యావరణ దినోత్సవం 

విశాఖపట్నం, జూన్ 05, 2018 (DNS Online) :  à°‰à°•à±à°•à±à°¨à°—à°°à°‚ సెక్టార్ 11 లో ఉన్న చైతన్య పబ్లిక్ స్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటారు. మంగళ వారం ఉదయం

పాఠశాల లో జరిగిన కార్యక్రమం లో పలువురు విద్యార్థులు ప్రదర్శించిన పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పై చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం లో పాల్గొన్న

పాఠశాల డైరక్టర్ పి. సుశీలా రాణి మాట్లాడుతూ పర్యావరణాన్ని పూర్తిగా కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ వస్తువులు, సంచీలను పూర్తిగా నిషేదించాలని, వాటిని ఏ విధంగానూ

వినియోగించరాదన్నారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మొక్కలు నాటాలని, నేటి సమాజం లో పెద్దలు చేస్తున్న తప్పిదాలకు చిన్నారి పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకం

అవుతోందన్నారు.స్వచ్ఛంగా గాలి ( ఆక్సిజన్ ) పీల్చుకోవాలన్నా లేకుండా సిగరెట్ , బీడీ, వంటి ధూమపాన వస్తువులని విచ్చల విడిగా వాడుతూ, భయంకర మైన విష వాయువులను ప్రకృతి

లోకి వదులుతూ వాయు కాలుష్యం చేస్తున్నారన్నారు. ఆరోగ్యకర వాతావరణం ప్రస్తుత కాలం లో లభిస్తుంది అన్న అవకాశమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న

సాంకేతిక విప్లవం కారణంగా ఎన్నో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని, అవి విడుదల చేసే విష వాయువుల తో వాతావరణం లోని గాలి, వినియోగించిన నీటిని సముద్రం, నదుల్లో నేరుగా

వదలడం వల్ల  à°œà°² కాలుష్యం మరింత ఎక్కువ అవుతున్నాయన్నారు. à°ˆ విధమైన భయంకర సమాజాన్ని మార్చడం లో కీలక పాత్ర పోషించవలసింది అధ్యాపకులు, ఉపాధ్యాయులేనన్నారు.

విద్యార్థి దశ నుంచే పిల్లలకు పర్యావరణ పరి రక్షణ పై అవగాహనా పెంచి, వారి వారి వసతి గృహాలలో ఎటువంటి పర్యావరణ వ్యతిరేక కార్యాచరణ చెయ్యకుండా నిరోధించన్నారు.

తద్వారా పెద్దలకు కూడా మంచి సందేశం అందించగలమన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులందరూ విద్యాలయం ఆవరణలోని, సెక్టార్ లోని వివిధ ప్రాంతాల్లోనూ మొక్కలను నాటారు. ఈ

కార్యక్రమం లో ప్రిన్సిపాల్ ఈ. చంద్రిక, కె. శైలజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam