DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాబు కోటరీ ఐఎఎస్‌లపై రహస్య విచారణ నిజమేనా …!

(DNS రిపోర్ట్ : రాజా. పి, spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ , అమరావతి) 
 
అమరావతి , అక్టోబర్ 11 , 2019  (DNS ) : చంద్రబాబు హయాంలో పనిచేసిన ఐఎఎస్‌ అధికారులలో కొంతమందికి మాత్రమేకట్టబెట్టిన

ముఖ్యమంత్రి జగన్‌ మిగతా వారికి à°—à°¤ నాలుగు నెలల నుండి పోస్టు ఇవ్వలేదు. వారికి ఎందుకు పోస్టింగ్‌ ఇవ్వలేదు అనే కారణాలు మాత్రం బయట పడటం లేదు. పోస్టింగ్‌ కోసం

ఎదురు చూస్తున్న ఐఎఎస్‌ అదికారులలో నలుగురు అదికారుల అక్రమార్జనపై సిఎం జగన్‌ రహస్య విచారణ జరిపిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ మాసాంతానికి

విచారణలో ఎవరెవరు అక్రమాస్తులు కూడబెట్టారని అనే విషయం ఆధారాలతో సహా బయట పడితే.. వారి ఆస్తులపై ఏసిబి దాడులు జరిగే అవకాశాలున్నాయి. ఎవరా నలుగురు ఐఎఎస్‌ అదికారులు..

వారి పేర్లు వారి ఆస్తుల వివరాలు బయటపడకుండా రహస్య విచారణ జరుపుతున్న ఏసిబి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయం బయటకు పొక్కితే జాగ్రత్త అని ముందే

హెచ్చరించటంతో ఆ అధికారులు ఒక చిన్న విషయం కూడా బయట పడకుండా ముఖ్య అధికారులను కలిసి వివరాలను ఆదారాలతో సహా అందజేస్తున్నట్లు సమాచారం.

ఈ అధికారులు ఎంత

సంపాదించారు. వారు సంపాదించిన ఆస్తులు ఎక్కడ భద్రపరిచారు అనే విషయంపై ఏసిబి అధికారులు కూపి లాగుతున్నారు. బెంగుళూరు, హైదరాబాదు, ఢిల్లీ, ముంబై ప్రాంతాలకు

కొంతమంది అధికారులు వెళ్లి వివరాలు సేకరించినట్లు సమాచారం. అలాంటి విచారణ ఏం జరగటం లేదు. ఇదంతా ఆ అధికారులకు వ్యతిరేకులైన వారి కుట్ర అని కొంతమంది చెబుతున్నారు.

ఇందులో నిజా నిజాలు మరి కొద్ది రోజులలో బయట పడబోతున్నాయి. కొంతమంది అధికారులు చెన్నై నగరంలో భారీ ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లు గతంలోనే ఆరోపణలు వచ్చాయి.

దీనిపై నిజా నిజాలు త్వరలో బయటపడే అవకాశాలు ఉన్నాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam