DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జలాల వినియోగంపై ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది 

మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . . 

అమరావతి,  à°…క్టోబర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌) : కృష్ణా గోదావరి జలాల

వినియోగంపై విభజన చట్టం ప్రకారం ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు జరిగిందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో

ఆయన మాట్లాడుతూ కేంద్ర జలవనరుల శాఖామంత్రి, తెలంగాణ, ఏపి ముఖ్యమంత్రులు ఎపెక్స్ కౌన్సిల్ లో సభ్యులుగా ఉంటారన్నారు. పార్లమెంటు సాక్షిగా చేసిన చట్టాలన్నీ

తెలుగు రాష్ట్రాల సిఎంలకు చుట్టాలయ్యాయన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల సిఎంలు చర్చల్లో ఏ విషయాలు చర్చించారో వివరణ ప్రజలకు ఇవ్వాలన్నారు. రెండు రాష్ట్రాల

అధికారులతో జలవనరుల విషయాలను చర్చించారా అని ప్రశ్నించారు. ప్రజల హక్కులు కాపాడాల్సిన బాధ్యత సిఎంజగన్మోహన్ రెడ్డిపై ఉందన్నారు. తెలంగాణా బాటలోనే ఏపి

ముఖ్యమంత్రి నడుస్తున్నారని,  à°•à±‡à°‚ద్ర జలశక్తి శాఖ కోరిన ఎజెండా పంపడానికి ఎందుకు విముఖత ఉందొ తెలపాలన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలల్లో పక్క రాష్ట్ర

ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఏం అడిగారన్నారు. పోలవరం కేసులు ఎత్తేస్తానని ఎన్నికల్లో చెప్పిన కెసిఆర్ ను, ఆ విషయం అడిగారా అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి మీకు

ఎవరు హక్కు ఇచ్చారో చెప్పాలన్నారు. మనం మనం చూసుకుందాం అని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా అంటారని, ఇరు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల విషయంలో సమావేశం ఎందుకు

చేయట్లేదన్నారు.

రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడటం లేదని, వరద నీటి విషయంలో, నీటి వినియోగం పెరిగిందని తెలంగాణా ఇంజనీర్ ఇన్ ఛీఫ్ లెటర్ రాస్తే, జగన్మోహన్

రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కృష్ణా జలాల వినియోగం విషయంలో,  à°°à°¾à°œà°¶à±‡à°–రరెడ్డి చేసిన తెలివితక్కువ నిర్ణయంతో ఇచ్చిన మెమో ముప్పుగా మారిందని మండిపడ్డారు.

వరద జలాలు రాని పరిస్ధితుల్లో మాట్లాడే వారు లేరన్నారు. కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి చూసుకోవడానికి, కృష్ణాజలాల విషయం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 170ఎకరాల పంచాయితీ

కాదన్నారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని, కెసిఆర్ తెలిపారు. కెసిఆర్ మాటలకు ఎందుకు, జగన్ నోరు మెదపటం లేదని, కర్నాటక, మహారాష్ట్ర

ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో వెంటపడ్డారన్నారు. కర్నాటక, మహారాష్ట్ర కేసులపై టిడిపి రివ్యూలు చేసి, ఎప్పటికప్పుడు మాట్లాడింది చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి

జగన్మోహన్ రెడ్డి కృష్ణా జలాల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు. ఐదువేల కోట్ల విద్యుత్ బకాయిలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అడగడం లేదు. విద్యుత్ ఉద్యోగులను

ఏకపక్షంగా పంపేస్తే ఏం చేసారన్నారు. 2లక్షల కోట్లు ఆస్థులు పంపకాలు జరగాల్సి ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రెండు తెలుగు

రాష్ట్రాల సిఎంలు నాలుగు సార్లు కలిసారు, కలిసి ఏం నిర్ణయించారు చెప్పాలన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam