DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో గరీబ్ రథ్ దిశను మార్చండి మహాప్రభో. .

సి హార్స్ కూడలి ట్రాక్ వద్ద  à°¨à°¿à°²à°ªà°µà°¦à±à°¦à± . .

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వినతి . . . 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం,

అక్టోబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌): సికింద్రాబాద్  నుంచి విశాఖపట్నం చేరుకుంటున్న గరీబ్ రథ్ రైలు ను షెడ్ కు తీసుకువెళ్లడం కంటే ముందు à°ˆ రైలును పోర్ట్ మార్గం లో

నిలపవద్దని, దీన్ని దిశను మార్చాలని విశాఖపట్నం పోర్ట్ ఉద్యోగులు, ఇతర సంస్థల ఉద్యోగులు రైల్వే అధికారులను కోరుతున్నారు.  à°µà°¿à°¶à°¾à°– రైల్వే స్టేషన్ లో ఉదయం 8 :30 గంటలకు

ప్రయాణీకులు దిగిన తదుపరి ఈ రైలు లోకో షెడ్ కు వెళ్లాల్సి యుంది. అయితే అక్కడ ఖాళీ ఉండక పోవడం, పైగా ఈ రైలు రాత్రికి గాని పట్టాలు ఎక్కాల్సి న అవసరం లేకపోవడం తో

దీన్ని కాన్వెంట్ జంక్షన్ మీదుగా, పోర్ట్ సి హార్స్ కూడలి వరకూ తీసుకు వెళ్తున్నారు. అక్కడే ఈ రైలును ప్రతి రోజూ ఉదయం 9 :30 గంటలవరకూ లెవెల్ క్రాస్ దగ్గరే నిలిపి

ఉంచుతున్నారు. à°ˆ కూడలి ని దాటుకుని అదే సమయంలో ప్రతి రోజూ  à°µà°‚దలాది మంది ఉద్యోగులు విధులకు వెళ్లాల్సి యుంది. 

రాత్రి తిరిగి విశాఖ నుంచి బయలుదేరే లోపు

రైలును శుభ్రం చేసేందుకు లోకో షెడ్ కు తరలిస్తారు. ఉదయం ఎనిమిది న్నర గంటల సమయంలో విశాఖ రైల్వే స్టేషన్ కు వచ్చే రైళ్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల గరీబ్ రథ్

వెంటనే లోకో షెడ్ కు తరలించడం కుదరడం లేదు. దీంతో గరీబ్ రథ్ ను రైల్వే స్టేషన్ నుంచి విశాఖ పోర్టు వైపుకు వెళ్లే రైల్వే ట్రాక్ మీదుగా సీ హార్స్ జంక్షన్ వైపునకు

రైల్వే ఉన్నతాధికారులు పంపుతున్నారు.

అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ప్రతిరోజు గరీబ్ రథ్ రైలును సి హార్స్ జంక్షన్

వైపుకు పంపిస్తుండడం తో అక్కడ  à°¤à±€à°µà±à°° ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బంది:

సీ హార్స్ జంక్షన్ నుంచి విశాఖపట్నం పోర్ట్

ట్రస్ట్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇన్కమ్ టాక్స్ కార్యాలయం, ఎన్ఎండిసి కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం 9:30 గంటలకు ఆయా కార్యాలయాల సిబ్బంది సి

హార్స్ జంక్షన్ మీదుగా తమ ఆఫీసులకు వెళ్ళవలసి ఉంటుంది. అయితే సి హార్స్ జంక్షన్ మలుపు తిరిగిన వెంటనే రోడ్డుకు అడ్డంగా గరీబ్ రథ్ రైలు నిలిచి ఉండటంతో దాదాపుగా

అరగంట నుంచి 45 నిమిషాల పాటు ఆయా ఉద్యోగులు ఎండలో పడిగాపులు పడాల్సి వస్తోంది. ఆఫీసులకు వెళ్లే సమయంలోనే గరీబ్ రథ్ రైలును రోడ్డుకు అడ్డంగా పట్టాలపైన వేయడంపై

ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులు వెళ్లే దారిని విడిచిపెట్టి  à°•à±Šà°‚చెం ముందుగా కానీ,  à°µà±†à°¨à°• గాని రైలు ను  à°¨à°¿à°²à°¿à°ªà°¿à°¤à±‡ ఎటువంటి ఇబ్బంది లేకుండా

రాకపోకలు సాగించే వీలుంటుందని అభిప్రాయపడుతున్నారు.

 à°ªà±à°°à°¤à°¿à°°à±‹à°œà± ఉదయం కార్యాలయానికి వెళ్ళే సమయంలో గరీబ రధ్ రైలు అడ్డుగా రావడంతో ఆఫీసులకు ఆలస్యం

అవుతుందని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రస్తుతం అన్ని కార్యాలయాలు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తుండటంతో కార్యాలయాలకు తొందరగానే బయలుదేరినా ,

మార్గమధ్యంలో రైలు అడ్డురావడంతో తమకు ఆలస్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు తక్షణమే ఈ వ్యవహారంపై దృష్టిసారించి సమస్యను

పరిష్కరించాలని ఈ మార్గంలో ప్రయాణించే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు.

మరో మార్గం ఉన్నా. . సురక్షితం కాదు:. .

మరో వైపు రైలు అడ్డంగా ఉన్న సమయంలో...

ఒకవేళ వెను దిరిగి మరో మార్గంలో వెళ్ళాలన్నా సీ హార్స్ జంక్షన్ నుంచి కాన్వెంట్ కూడలి వరకు వచ్చి పోర్ట్ అంతర్గత రహదారి గుండా రావలసి ఉంటుంది. ఆ మార్గం లో పోర్ట్

లారీలు తిరుగుతూ ఉండడంతో అది కొంత ప్రమాదకరమని భావించి à°† మార్గంలో వెళ్లే సాహసం చేయలేరు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam