DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రకటించిన హామీలు అమలు చేయాల్సిందే : APWJF

జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ళు కేటాయించాల్సిందే

ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.ఆంజనేయులు

విశాఖపట్నం, జూన్ 05, 2018 (DNS Online) : ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వం రాష్ట్రం లోని జర్నలిస్టులకు ప్రకటించిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.ఆంజనేయులు డిమాండ్ చేశారు.

ఆంద్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ విశాఖ నగరం నూతన కార్యవర్గం ఎన్నిక మంగళవారం స్తానిక సీతమ్మధారలోని నార్లభవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య

అతిధిగా హాజరైన అయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సమయం లో ఇచ్చిన ఎన్నో హామీలు  à°•à°¾à°°à±à°¯à°°à±‚పం దాల్చలేదన్నారు. వాటిని సాదించుకోడానికి ఎపి బ్రాడ్ బ్రాడ్ కాస్ట్

జర్నలిస్ట్స్ అసోసియేషన్ ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఈ మధ్యకాలంలో జర్నలిస్టులపై దాడులు,

హత్యలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. డెస్క్ జర్నలిస్టుల కు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు, 

రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు

మాట్లాడుతూ రాష్ట్రంలో బలమైన యూనియన్ ఫెడరేషన్ అని చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందువుంటామని స్పష్ష్టం చేశారు. బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్

రాష్ట్ర కన్వీనర్ బి.రాధాకృష్ణ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఏపీబీజేఎ కమిటీలను వేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎపిడబ్ల్యూ

జేఎఫ్ నగర అధ్యక్ష, కార్యదర్శులు పి నారాయణ్ , అనురాధ , రూరల్ కార్యదర్శి ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


ఏపీ బ్రాడ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్

అసోసియేషన్

నగర అధ్యక్ష, కార్యదర్శులుగా ఇరోతి ఈశ్వరావు , విజయ్

ఎపిడబ్ల్యూ జేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశం లో

ఏపీ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ విశాఖ నగర అధ్యక్షులుగా ఇరోతి ఈశ్వరావు (మెట్రో టివి) , కార్యదర్శిగా జి విజయ్ (10 టీవీ), ఉపాధ్యక్షులుగా నరేష్ (హెచ్.ఎం.

టీవీ కెమెరా మెన్ ), జార్జి (10టీవీ ) , నిర్వాహక కార్యదర్శులుగా బి. శివ (ఎఎన్ఐ ), నాయుడు ( ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ), సహాయకార్యదర్సులుగా బాబురావు ( టీవీ 9కెమెరా మెన్ ), పి ప్రకాష్

(మెట్రో టీవీ ), సత్య (10టీవీ, కెమెరా మెన్ ), రూపా అమర్ నాథ్ ( స్నేహ టీవీ), అనిల్ ( ఐ.న్యూస్ కెమెరా మెన్), కోశాధికారి రమేష్ బొప్పన ( మెట్రో టీవీ ), కార్యవర్గ సభ్యులుగా ప్రసాద్

(వాజి ), వెంకటేష్ (సివిఆర్ ), పోలాంకి రెడ్డి ( ఈటీవీ), దిలీప్ ( స్నేహ టీవీ ), హారిక (ఎస్.డి.వి ), రమేష్ (వి టెల్ ) కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పలువురు

ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam