DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైతాంగానికి భరోసా రైతు భరోసా : మంత్రి ధర్మాన 

ఎమ్మెల్యే స్థాయి పైబడిన ప్రజా ప్రతినిధులు అనర్హులు 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌):

రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి భరోసా కల్పించింది కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.

సోమవారం శ్రీకాకుళంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని శతశాతం

నెరవేర్చే దిశగానే ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందన్నారు. రైతాంగానికి అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు

రైతు భరోసా కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ముందుగా చెప్పినట్టుగా అధికంగా ఇచ్చేందుకు ప్రణాలికను సిద్దం

చేశారన్నారు. 

 à°°à±ˆà°¤à± భరోసాను అర్హులైన వారందరికీ, ప్రజా ప్రతినిధులకు కూడా అందిస్తామని, అయితే ఎమ్మెల్యే స్థాయి పై బడిన హోదాల్లో పనిచేసిన, పనిచేస్తున్న

వారికీ ఈ పధకం వర్తించదని తెలిపారు. అర్హులైన రైతు మరణించినట్టయితే అయన సతీమణికి నేరుగా ఎటువంటి ధ్రువపత్రం ఆవసరం లేకుండానే ఇస్తామని, కుమారులు, కుమార్తెలకు

మాత్రం లీగల్ ధ్రువపత్రం కావాలన్నారు. 
 à°°à±ˆà°¤à± భరోసా పథకానికి రూ. 5,510 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి

సాయాన్ని ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ డబ్బులను బ్యాంకులు ఇతర బకాయిలకు జమ చేసుకోవడానికి వీలు ఉండదు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పలుసార్లు

స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

రాజకీయ అంశాలపై మాట్లాడుతూ జిల్లాలో పార్టీ సభ్యులు అందరూ సఖ్యతతోనే ఉన్నామని, ఎవరి మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవన్నారు. ఈ

సమావేశంలో శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కేంద్ర మాజీ మంత్రి à°¡à°¾. కిల్లి కృపారాణి, శాసన సభ్యులు  à°¡à°¾. అప్పలరాజు, శ్రీమతి రెడ్డి.శాంతి,

పేడాడ.తిలక్,  à°ªà°¿à°°à°¿à°¯à°¾ సాయిరాజ్, మహిళ అధ్యక్షురాలు మంజు తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam