DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రపంచ నాధుని పై పంచాయితీ పెడతారా ? తేడాలొస్తే 

వెంకన్న పుట్టినప్పుడే à°ˆ బోర్డు కూడా పుట్టిందేమో ? 
కొత్తగా వచ్చిన à°ˆ పాలక మండలికి అన్నీ తెలుసా ? 

ఏసీ గదుల్లో కూర్చుని అనగా కంగాళీ

చేస్తున్నారు 
వివాదానికి జవాబు చెప్పలేకే . . . అర్చకులపై కక్షా ? 

విశాఖపట్నం, జూన్ 5, 2018 (DNS Online) :  à°¤à°¿à°°à±à°®à°² తిరుపతి దేవస్థానములకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖ్యాతిని

ఒక్క మాటతో రచ్చకీడ్చిన ఘనత ఈ పాలక మండలిదే. ఇంతవరకూ అపవాదులు, అభ్యంతరాలూ వచ్చినా, రచ్చకీడ్చిన వ్యవహారం జరగలేదు. అన్నీ వీళ్ళకే తెలుసు, తిరుపతి వెంకన్న ఈ భూమి

మీద పుట్టినప్పుడే ఈ బోర్డు పాలక మండలి కూడా పుట్టిందేమో అన్నట్టుగా ఉంది వీళ్ళ తీరు. ఈ బోర్డు లో సభ్యులుగా నియమితులైన వారెవ్వరూ గతం లో పెద్దగా ఊరూ పేరూ

లేనివారే. పైగా వీరు గతం లో తిరుమలకు ఎన్నిసార్లు వచ్చారో కూడా ఎవరికీ తెలియదు. కేవలం రాజకీయ లబ్ది కోసమే ఈ పోస్టుల్లోకి వచ్చి, స్వామీ కి భక్తులు ఇచ్చిన

ముడుపులతో అప్పనంగా జల్సాలు చేసేద్దామన్న ఏకైక ఉదేశ్యం ఉన్నట్టుగా కనపడుతోంది. పైగా వీళ్ళకి తోడు, తానా తందానా అన్నట్టు గా ఉత్తరాది నుంచి వఛ్చిన

కార్యనిర్వహణాధికారి à°•à°¿ కూడా à°ˆ దేవాలయ నిర్వహణ కొత్తే. పైగా ఈయనకు స్థానికేతరుడు అన్న వివాదం కూడా ఉంది. 

తిరుమల గురించి, దాని వైశిష్ట్యం గురించి

సంపూర్నంగా తెలిసిన వారు దాదాపుగా ఇప్పుడు లేనేలేరు అంటే అతి శయోక్తి కాదు. అయితే అక్కడ ఆలయం లో తరతరాలుగా స్వామీ సేవ చేసే అర్చకులకు కూడా తిరుమల వైభవం

పూర్తిగా తెలిసే అవకాశాలు తక్కువే. అలాంటిది స్వామి గురించి ఏమీ తెలియని సభ్యులు, అస్సలే తెలియని కార్యనిర్వాహణాధికారి ఏసీ గదుల్లో కూర్చుని ఆలయ వ్యవస్థను

అస్తవ్యస్తంగా కెలికేస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. దీనికి అదనంగా ఇటీవల టిటిడి బోర్డు చైర్మన్ గా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి

హైందవేతరుడు అనేందుకు చాలా ఆధారాలున్నాయంటూ భక్తులు, హిందూ సంస్థలు, పలువురు పీఠాధిపతులు వ్యతిరేకించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అదే విధంగా ఇప్పుడు పాలక

మండలి లో నియమితులైన సభ్యులు దాదాపుగా అందరూ కొత్తవారే  à°…నే కంటే తిరుమలకు కొత్తవారు అనడం సబబు à°—à°¾ ఉంటుంది. ఎదో ఏడాదికి ఒకసారి స్వామి దర్శనానికి వచ్చే వీరికి

ఆలయం లో ఎన్ని ద్వారాలు ఉన్నాయో కూడా తెలుసో లేదో అనుమానమే. అలాంటిది వీరంతా నాలుగు గోడల మధ్య కూర్చుని అడ్డదిడ్డంగా తీసుకునే నిర్ణయాలను యావత్ హిందూ సమాజం

వ్యతిరేకిస్తోంది. పైగా బోర్డు లో నియమితులైన సభ్యులు పై పలు వివాదాలున్నాయి. వీళ్ళ నియామకం పై ఎన్నో అభ్యన్తరాలు కూడా వచ్చాయి. అయితే టిటిడి బోర్డు ని, ఆలయాన్ని

కేవలం అధికార పార్టీ కార్యాలయం చేద్దామనుకున్న పాలకులకు తెలిసి వచ్చేది ఎన్నడో. 

జన ఘోష బేఖాతరే . . . .ఘోర పరిణామాలు :

గత ఏడాది విజయవాడ లో సుమారు 40 హిందూ

దేవాలయాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన తెలుగుదేశం పార్టీ, తన పని పూర్తి చెయ్యాలి అనుకుందో ఏంటో అత్యంత ప్రాధాన్యం కల్గిన, సునిశిత అంశమైనా తిరుమల పై పడింది.

అక్కడ గుళ్ళు కూల్చాము కదా, ఇక మిగిలింది తిరుమలే అనుకున్నారో ఏమో గత కొన్ని నెలలుగా టిటిడి పై పడ్డారు. దీనిలో భాగమే. . . వంశ పారం పర్య అర్చక వ్యవస్థ పై వేటు వేసి

చప్పట్లు కొట్టుకోవడం బ్రాహ్మణుల ఆగ్రహానికి గురి అయ్యింది. ఇక ఈ టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయాలు రానున్న కాలం లో అధికార పార్టీకి గట్టిగా గుణపాఠం

చెప్పేందుకు దారి తీస్తున్నట్టు గానే ఉంది. ఈ బోర్డు వచ్చిన తర్వాత అధికార పార్టీకి ఏమి ఒరిగిందో తెలియదు కానీ, ఉన్న ప్రతిష్ఠా ను పూర్తిగా చెట్టెకించారన్నది

వాస్తవం.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam