DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైతు తో బాటు జగన్మోహనరెడ్డి అందరికీ భరోసా

పర్యాటక శాఖ మంత్రి ఎం శ్రీనివాసరావు

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, అక్టోబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌): రూ. 13500 లతో రైతుకు భరోసా

కల్పించిన జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం పేద వారందరికీ భరోసా గానే ఉంటారని పర్యాటక శాఖ మంత్రి à°Žà°‚ శ్రీనివాసరావు  à°…న్నారు. మంగళవారం విశాఖ జిల్లా

పెందుర్తి లో నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో రూ.222 కోట్లను రైతులకు భరోసా

ఇస్తున్నట్లు తెలిపారు. దీనిలో రూ.6 వేలు  à°ªà±à°°à°§à°¾à°¨ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుండి మిగిలిన రూ. 7500 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. రూ మూడు వేల కోట్లతో ధరల

స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు, అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతు

అభివృద్ధికి భూసార పరీక్షలు, విత్తనాలు, ఎరువులు సరఫరా, సమగ్ర సూక్ష్మపోషక యాజమాన్య పథకం, ఉచిత పంటల బీమా పంట రుణాలు అమలు మొదలైనవాటితో పాటు గ్రామ సచివాలయం లో

గ్రామీణ వ్యవసాయ సహాయకులను నియమించడం జరిగిందని తెలిపారు. వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ పేదరికంలో ఉన్న వారికి ఏమి అవసరమో ముఖ్యమంత్రికి తెలుసని

అందుకే ఆటోవాలా కు పదివేల రూపాయలు, ఆరోగ్య శ్రీ, అమ్మ వడి మొదలైన పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు మాట్లాడుతూ

జగన్మోహన్రెడ్డి ఎన్నికైన మొదలు రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి అన్నారు. రైతు తన ఖాతాలో ఒక్క రూపాయి జమ చేస్తే ప్రభుత్వం వారి పంటకు భీమా సొమ్ము

మొత్తం చెల్లిస్తుందని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam