DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైతుభరోసా కు నవంబర్ 15 వరకు గడువు పెంపు

వీడియో కాన్ఫరెన్స్ లో  à°ªà±à°°à°­à±à°¤à±à°µ సలహాదారు

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚) : . . .

శ్రీకాకుళం, అక్టోబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్ర

వ్యాప్తంగా రైతు భరోసా పథకం అర్హుల ఎంపికకు గడువును నవంబర్ నెల 15 వరకు పెంపుదల చేసినట్లు ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లామ్ పేర్కొన్నారు. బుధవారం రైతు భరోసా

కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక రోజునే రూ.3 వేల కోట్లను రైతు భరోసా మొత్తం

పంపిణీ జరిగిందని, ఇందుకు కృషిచేసిన జిల్లా కలెక్టర్లను ఆయన అభినందించారు. అయితే ఇంకా జిల్లాల్లో మిగిలివున్న అర్హులైన రైతులను ఎంపిక చేసేందుకు నవంబర్ 15 వరకు

గడువు పెంచినట్లు ఆయన చెప్పారు. కావున జిల్లా కలెక్టర్లు నవంబర్ 15 వరకు జాగ్రత్తగా పర్యవేక్షణ చేయాలని, ప్రతి రోజు లబ్ధిదారుల జాబితాలను తీసుకొని తమకు

 à°¸à°®à°°à±à°ªà°¿à°‚చాలని కోరారు. తద్వారా రైతు భరోసా ఆర్ధిక సహాయం మొత్తాన్ని చెల్లింపుకు ఏర్పాట్లుచేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేసారు.

వ్యవసాయ శాఖ ప్రత్యేక

ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 38 లక్షల కుటుంబాలకు రైతు భరోసా పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇంకా రాష్ట్రంలో 10 లక్షల మంది

వివరాలు పరిశీలన చేయాల్సి ఉందని, అక్టోబరు 15 వ తేదీన తీసుకోకుండా మిగిలిన రైతులకు ప్రతి బుధవారం రైతు భరోసా చెక్ లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని

కలెక్టర్లను ఆదేశించారు. అర్హులైన రైతుల వివరాలను ఆయా గ్రామ సచివాలయాల్లో జాబితాలును విధిగా ప్రదర్శించాలని, ఏ ఒక్క రైతు రైతు భరోసా ఆర్ధిక సహాయాన్ని

నష్టపోరాదని తెలిపారు. రైతు భరోసా కార్యక్రమం పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో ఎటువంటి అపోహలను నమ్మరాదని స్పష్టం చేసారు. కౌలుకు ఇచ్చినంత మాత్రాన భూ

యజమానులు ఎటువంటి హక్కులు కోల్పోరని, అలాగే అర్హులైన వ్యక్తి చనిపోతే కుటుంబంలోని భార్య లేదా భర్త లబ్దిదారులుగా గుర్తించాలని ఆమె చెప్పారు. ఇందుకు ఆయా కుటుంబ

సభ్యుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని పేర్కొన్నారు.  à°†à°°à±.à°“.ఎఫ్.ఆర్ లబ్దిదారులు కూడా కౌలుదారు జాబితాలో ప్రయోజనం పొందుతారని ఆమె చెప్పారు.

ఈ వీడియో

సమావేశంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, సంయుక్త కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు బి.జి.వి.ప్రసాద్, సహాయ

సంచాలకులు బి.శ్రీనివాసరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ జి.వి.బి.డి.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam