DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎరక్కపోయి అన్నారు - ఇరుక్కు పోయారు. లీగల్ నోటీస్ పేరిట టిటిడి సెల్ఫ్ గోల్ 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ప్రతిష్టను దెబ్బతీసేవారికి లీగల్ నోటీసు: à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు సెల్ఫ్ గోల్  

క్రైస్తవులు ఉద్యోగం చెయ్యడం ప్రతిష్ట ను పెంచినట్టా? : భక్తులు

తిరుమల, జూన్ 6, 2018 (DNS

Online) :  à°¤à°¿à°°à±à°®à°² తిరుపతి దేవస్థానముల ప్రతిష్టకు à°­à°‚à°—à°‚ కల్గించే వారిపై లీగల్ à°—à°¾ నోటీసులు ఇఛ్చి చర్యలు తీసుకుంటామని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పాలక మండలి చేసిన హెచ్చరికలపై సర్వత్రా

నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఈ వ్యాఖ్యలతో వాళ్ళే ఇరుకున పడ్డారు. వీళ్ళు చేసిన వ్యాఖ్యలు వీళ్ళకే త్రిప్పి కొట్టినట్టుగా పరిణమించాయి. టిటిడి లో జరుగుతున్న

అనాచారాలపై ప్రశ్నించిన ఆగమ పండితులు రమణ దీక్షితులు పై చర్యలు తీసుకోవాలి అని తీర్మానించిన నేపధ్యంలో ఈ పాలక మండలికి తెలిసో తెలియకో ఈ ప్రకటన చేసేసారు. అయితే

ఆగమ వివాదం అనేది అర్చక, ఆరాధన వర్గాలకు మాత్రమే చెందినది, అంటే ఆలయం లో అంతర్భాగం మాత్రమే. ఇది కేవలం స్వామికి ప్రత్యక్షంగా అర్చన, ఆరాధనాదులు చేసే వారికి

మాత్రమే సంబంధం ఉంటుంది. వాటిని పరిష్కరించవలసింది కూడా వారే. దీనిలో పాలక మండలి కి ఎటువంటి సంబంధం ఉండదు. ప్రధానంగా రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు ఈ విధమైన

అభ్యంతరాలు ఎక్కువగా ఉన్నాయి. పోటు ( స్వామి వారి వంట శాల ) తో సహా అన్నీ అభియోగాలూ ఆగమ విధాన అభ్యంతరాలే.  à°…యితే వీటిని తట్టుకోలేని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పాలక మండలి à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

ప్రతిష్ట పోయిందంటూ నానా హంగామా చేసేసి, రచ్చ చేసి, రోడ్డెక్కింది. అయితే వీళ్ళు చేసిన వ్యాఖ్యల ప్రభావం వీళ్ళనే ఇరకాటం లో పెట్టింది అనే విషయాన్ని మరిచి

పోయారు.

క్రైస్తవులు టిటిడి లో ఉద్యోగం చేస్తే ప్రతిష్ట నిలబడుతుందా ?

టిటిడి లో అన్యాయం జరుగుతోంది అని ఒక అర్చకుడే బహిరంగం గా ప్రకటిస్తే అది టిటిడి

ప్రతిష్ట కు భంగం కలిగినట్టు ట. ఇతర మతాల వాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేసి, వాళ్ళ మత ప్రచారం చేసుకుంటే టిటిడి ప్రతిష్ట పెరిగినట్టా అని సామాన్య భక్తులు సంధించిన

ప్రశ్నలకు పాలక మండలి జవాబు చెప్పాల్సియుంది. 

ఇప్పడికే 1500  à°®à°‚ది అనుమతస్తులు ( క్రైస్తవులు - దరఖాస్తు లో వీళ్ళు హిందువులుగానే ఉంటారు) అధికారికంగానే à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో

ఉద్యోగం చేస్తున్నారు అంటూ సాక్షాత్తు టిటిడి ఉద్యోగులే చెప్పిన విషయం టిటిడి పాలక మండలి కి తెలియలేదు. ప్రస్తుతం ఉన్న కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్

సింఘాల్ ప్రత్యక్ష్యంగా ప్రకటించిన విషయం ఏంటంటే తమ విచారణలో 44 మంది అధికారికంగా క్రైస్తవులు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో ఉద్యోగం చేస్తున్నారు.  à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నిబంధనల ప్రకారం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

లో ఉద్యోగం చేసేవారు తప్పని సరిగా హిందువులే అయి ఉండాలి. ఈ విషయం పాలక మండలికి తెలియదా. లేదా తెలిసినా పట్టించుకునే తీరిక లేదా. పాలక మండలి లో ఉన్నవారు అందరూ

అధికార పార్టీ ప్రతినిధులే. ఇప్పుడు టిటిడి లోని క్రైస్తవుల పై చర్యలు తీసుకుంటే రాబోయే ఎన్నికల్లో క్రైస్తవుల ఓట్లు పడవు అని అధికార పార్టీ ఇచ్చిన ఆదేశాలతో

వీళ్ళు à°ˆ విషయం ప్రక్కన పెట్టినట్టున్నారు.  

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam