DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గృహనిర్మాణ పధకాలు వేగవంతం చెయ్యాలి : సీఎస్

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలో మంజూరు చేసిన గ్రామీణ,పట్టణ గృహనిర్మాణ పధకాలు వేగవంతంగా

జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. ఈమేరకు మంగళవారం అమరావతి సచివాలయంలో మున్సిపల్ పరిపాలన,

పట్టణాభివృద్ధికి సంబంధించి రాష్ట్ర స్థాయి శాంక్షనింగ్ మరియు మానిటరింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్ఎంసి)సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ

ప్రస్తుతం గ్రామ,వార్డు సచివాలయాలు అందుబాటులోకి వచ్చిన నందున ఆయా క్షేత్రస్థాయి సిబ్బంది సేవలను పూర్తిగా వినియోగించుకుని గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో

చేపట్టిన గృహనిర్మాణ పధకాలను వేగవంతంగా పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ,మున్సిపల్ పరిపాలన శాఖల అధికారులను ఆదేశించారు.వచ్చే మార్చి నాటికి

ఇళ్లు లేని ప్రతి కుటుంబానికి ఇళ్లు నిర్మించే ప్రక్రియలో భాగంగా 25లక్షల మందికి ఇళ్ళు సమకూర్చనున్నందున విడివిడిగా నిర్మించే గృహం అయితే 40 రోజుల్లోగా,బహుళ

అంతస్తుల ఇళ్లు అయితే 150 రోజుల్లోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.ప్రతి ఇంటికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సహాయంతో పాటు ఇంటి స్థలం

లేదా పట్టాను బ్యాంకులో తనఖాపెట్టి కొంత మొత్తం బ్యాంకు ఋణ సౌకర్యం కల్పించడం ద్వారా లబ్దిదారులు సకాలంలో ఇళ్లు నిర్మించుకునేలా చూడాలని సిఎస్

ఆదేశించారు.సకాలంలో ఇళ్లు నిర్మించుకోవడం, తీసుకున్న ఋణాన్ని సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా ఆయా లబ్దిదారులు పొదుపు చర్యలు పాటించడం ద్వారా ఆర్దికంగా

నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. à°°à°¾à°·à±à°Ÿà±à°° గృహనిర్మాణ శాఖ  à°®à±à°–్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ

పిఎంఎవై పధకం కింద రాష్ట్రంలోని వివిధ అర్బన్ స్థానిక సంస్థలు,అర్బన్ డెవలప్మెంట్ అదారిటీల్లో సుమారు 6లక్షలకు పైగా గృహాలను నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం

జరుగుతోందని పేర్కొన్నారు.అంతకు ముందు ఎపిటిడ్కో ఎండి దివాన్ మైదీన్ అజెండాల అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం

చౌటుపాలెం గ్రామం వద్ద డిమాన్ స్టేషన్ హౌసింగ్ ప్రాజెక్టు(డిహెచ్పి) కింద సామాజిక హాల్ తో కూడిన 36 గృహాలను తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించడం జరుగుతోందని

తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్యామల రావు, ఆంధ్రాబ్యాంకు డిజియం నాంచారయ్య,సిసిఎల్ఏ కార్యదర్శి చక్రవర్తి, గృహనిర్మాణ సంస్థ

సిఇ మల్లిఖార్జున, ఇతర హౌసింగ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam