DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజకీయ పరుగు పందెంలో వైకాపా ముందంజ 

విశాఖపట్నం, జూన్ 6, 2018 (DNS Online):  à°†à°‚ధ్ర ప్రదేశ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు మధ్య జరుగుతున్నా ఆధిపత్య పోరు నేపధ్యంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ à°’à°• అడుగు ముందు కు

వెళ్ళింది అని చెప్పవచ్చు. బుధవారం దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో ఉదయం 11  à°—ంటలకు జరిగిన పరిణామాల నేపధ్యం లో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వాడి వేడిగా మారిపోయాయి. ఆంధ్రా

కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అనే డిమాండ్ తో తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన ఐదుగురు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ఎంపీల దరఖాస్తులను లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్

ఆమోదించారు. దీంతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టయింది. అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవినీతి పై పోరాటం లో భాగం

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొన్ని నెలలుగా పాదయాత్ర చేసున్న విషయం తెలిసిందే. ఈ రోజు జరిగిన ఘటనతో అయన పోరాటానికి మరింత బలం

చేకూరినట్టయ్యింది. అధికార తెలుగుదేశం పార్టీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. రాష్ట్రం లో తన బలం నిలబెట్టుకునేందుకై తెలుగుదేశం కూడా తన నిజాయితీని

నిరూపించుకోవాల్సిన దుస్తుతి ఏర్పడింది. తమ ఎం పీ లతో పాటు ప్రతిపక్ష ఎం పీలను కూడా తమ వైపు లాక్కున్న తెలుగుదేశానికి ఈరోజు పరిణామం గొడ్డలి పెట్టుగా

మారింది. 

రాష్ట్రంలో ప్రస్తుతం పాలన అడుగంటి పోయింది. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకూ అందరు నేతలూ కేవలం రానున్న ఎన్నికల పైనే దృష్టి పెట్టి,

ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. అధికార పార్టీ ఏకంగా ప్రజాధనాన్ని కోట్లాదిగా వినియోగిస్తూ, ఒక గంట దీక్షలు, ధర్మ పోరాటాలు, వంచన దీక్షలు అని పేరు పెట్టి, ప్రతీ

జిల్లాలోనూ సభలు పెట్టి ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని, బీజేపీ ని  à°¤à°¿à°Ÿà±à°Ÿà°¡à°®à±‡ పనిగా పెట్టుకొగా, ప్రతిపక్ష పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా

అసెంబ్లీ సమావేశాలని కూడా à°—à°¤ రెండేళ్లుగా బహిష్కరించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీని తిట్టడమే హోమ్ వర్కు à°—à°¾ చేసుకుంది. 

 

 

pix: Courtesy to whomso ever it may

concern

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam