DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ ఆఫీసులకి వైకాపా పార్టీ రంగులేంటి? : సోము వీర్రాజు

నిన్న పచ్చ రంగు, నేడు ఆకుపచ్చ, తెల్ల రంగు.

చంద్రబాబు కి వైఎస్ జగన్ కి పెద్ద తేడాలేదు. .

గాంధేయ సిద్ధాంత ఆదర్శం కోసం బీజేపీ పాదయాత్రలు 

రంగుల

కళలు మానాలి - పాలన పై దృష్టి పెట్టాలి 

మీ పాదయాత్రలూ మీ అధికారా దాహం కోసమే . .  

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు  

DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à±

రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚) : . . . . .

శ్రీకాకుళం, అక్టోబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రభుత్వ ఉద్యోగులందరూ పార్టీకార్యకర్తలే అనే భావనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

భావిస్తున్నట్టు ఉందని భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. శుక్రవారం శ్రీకాకుళం లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం

లో అయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వెయ్యడం చూస్తుంటే వీళ్ళ వైఖరి పై ప్రజలకు విసుగు పుడుతోందన్నారు.

నిన్నటి దాకా పాలనలో ఉన్న తెలుగుదేశం పార్టీ తమ ప్రభావాన్ని ప్రభుత్వ సంస్థలపై చూపిస్తే. .. నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ప్రభావాన్ని చూపిస్తున్నట్టు

ఉందని, ఇద్దరి à°•à±€ ఏమాత్రం తేడాలేదన్నారు.  à°®à°°à±‹ 20 ఏళ్ళ కాలం అధికారం లో ఉండాలి అనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పగటి కలలు కనడం మాని, పరిపాలన పై దృష్టి పెట్టాలని

హెచ్చరించారు. 

మీ పాదయాత్రలూ స్వార్ధం కోసం. .  

2003 లో అధికారం కోసమే చంద్రబాబు నాయుడు, 2018 లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం లో చేసిన పాదయాత్రలూ కేవలం

వాళ్ళ స్వార్ధ పూరిత అధికార దాహం కోసమేనన్నారు. అయితే ప్రస్తుతం భారతీయ జనతాపార్టీ చేస్తున్న పాదయాత్రలూ గాంధీ సిదాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకు

వెళ్లేందుకు చేస్తోందన్నారు. గాంధీ 150 à°µ జయంతి ను పురస్కరించుకుని ప్రతి నియోజక వర్గంలోనూ 150 కిలో మీటర్ల దూరం పాద యాత్ర చేస్తున్నామన్నారు. 

ప్రభుత్వ

ఆఫీసులకు, పాఠశాలకు కూడా వైఎస్సార్ పార్టీ రంగులు వేయించగలుగుతున్న ముఖ్యమంత్రి అదే ఆఫీసుల్లో గాంధీ బొమ్మను పెట్టలేకపోయాడని మండిపడ్డారు. ఇక చంద్రబాబు కు

గాంధీ అంటే ఎవరో కూడా తెలియని స్థితి వచ్చేసిందని, అతను ప్రతిపక్ష నేతగా కూడా పనికిరాదని మండిపడ్డారు. 

à°ˆ విలేకరుల సమావేశం లో à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ లో బీజేపీ

రాష్ట్ర కార్యదర్శి  à°ªà±ˆà°¡à°¿ వేణుగోపాలం, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు, జిల్లా అధ్యక్షుడు చల్ల వెంకటేశ్వర రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

ఎస్. ఉమా మహేశ్వరీ, సీనియర్ నాయకులూ ఆర్. సూర్య ప్రకాశరావు, రాజేష్, ఎంవిజి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam