DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అతి వేగం ప్రమాదకరం - బైక్ రేసర్లకు కౌన్సలింగ్. డ్యూక్ బైక్ లే... ప్రమాద కారకం

విశాఖపట్నం, జూన్ 6, 2018 (DNS Online):  à°µà°¿à°¶à°¾à°– నగరం లోని పలు ఖాళీ రోడ్లపై విపరీతమైన వేగం తో ప్రయాణం చేస్తున్న పలువురు ద్విచక్ర వాహన దారులు, తల్లిదండ్రులకు నగర పోలీసులు

కౌన్సలింగ్ నిర్వహించారు. బుధవారం నగర పోలీసు మైదానం లో జరిగిన à°ˆ కార్యక్రమం లో సుమారు 15  à°®à°‚ది యువకులకు, వారి తల్లిదండ్రులకు అతి వేగం వాళ్ళ జరిగే ప్రమాదాలను,

నష్టాలను వివరించారు. యువకులను మందలించారు. à°ˆ సందర్బంగా ట్రాఫిక్ ఏసీపీ కె. ప్రభాకర్ ఆధ్వర్యవం లో à°°à±†à°‚à°¡à°µ పట్టణ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ సి ఐ సిహెచ్

శ్రీనివాస్, à°ªà±‹à°²à±€à°¸à± అధికారులు వేగం వల్ల కలిగే నష్టాన్ని తెలిపారు. à°—à°¤ ఏడాది జరిగిన రహదారి ప్రమాహాల్లో సుమారు 325 మంది మృత్యువాత పడ్డారని, వీరిలో యువకులే అధిక

శాతం ఉన్నారని, వీటిలో 135 మంది కేవలం బైక్ ల వల్లే ప్రమాదాలు జరిగాయని తెలిపారు. డ్యూక్ బైక్ లాంటి రేస్ బైక్ వాహనాలతో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ

బండి ని చూడగానే అతి వేగంతో వెళ్ళాలి అనే విధంగా మోడల్ ని రూపొందించడమే యువకులు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నట్టు అంచనా. వాహనం అనేది గమ్య స్థానానికి

సురక్షితంగా చేర్చడం కోసమే నని, అంతే తప్ప విలాసవంతంగా వేగంతో విహారం చెయ్యడానికి కాదన్నారు. నగరం లోని రోడ్లు పై ఈ విధమైన బైక్ లను అనుమతించడం వల్ల యువకులు

అత్యంత వేగంగా వాహనాలు నడుపుతున్నారన్నారు. ఇటీవల కాలం లో విడుదలవుతున్న కొత్త తరహా బైక్ ల మోజులో యువకులు తల్లిదండ్రులను పీడించి మరీ కొనిపించుకుంటున్న

సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. కనీసం వయసు 18 ఏళ్ళు నిండని వాళ్లకి కూడా ద్విచక్ర వాహనాలు ఇవ్వడమే కాకుండా వారు వాహనం ఎలా నడుపుతున్నారో కూడా చూడకపోవడం పెద్దల తప్పే

నన్నారు. తల్లిదండ్రులు భాద్యతలను విస్మరించి, అనుభవం లేని పిల్లలకు ఇలాంటి భారీ వాహనాలు కొని ఇవ్వడం వల్ల రోడ్డు మీద అతి వేగంతో వీళ్ళు బళ్ళు నడుపుతూ, రోడ్డు పై

వెళ్లే వారిని ప్రమాదానికి గురి చేస్తూ.... కొన్ని సందర్భాల్లో వారి మృత్యువుకు కారకులవుతున్నారన్నారు. విశాఖ నగర బీచ్ రోడ్ లో ప్రతి రోజూ సాయంత్రం జరుగుతున్నా

బైక్ రేస్ ల పై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని, వాటి పై నిఘావేసి పట్టుకునేందుకు కొన్ని బృందాలను కూడా నియమించుకోవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. ఉదయం, సాయంత్రం

వేళల్లో బీచ్ రోడ్ లో ఎందరో నగర వాసులు, మహిళలు, వృద్ధులు వాకింగ్ చేస్తుంటారని, ఆ సమయం లో ఈ బళ్ళు పై వీరు అతి వేగంతో వెళ్తూ... ఆ వేగం లో బండిని అదుపుచేయలేక వాకింగ్

చేసే వారిని ఢీ కొడుతున్నారన్నారు. దీని కి తోడు ట్రాఫిక్ సిగ్నల్స్ ను కూడా పాటించకుండా, నడుపుతున్న వాహనదారులూ ఉన్నారన్నారు. బుధవారం నిర్వహించిన కౌన్సలింగ్

లో కొందరు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈ బైక్ కొని ఇవ్వకపోతే మెడమీద నుంచి దూకుతామంటూ బెదిరించడం వల్లే ఇవి కొనవలసి వచ్చిందన్నారు. దానికి ట్రాఫిక్ సిబ్బంది

స్పందిస్తూ బెదిరిస్తే బళ్ళు కొని ఇవ్వడం వల్ల వీళ్ళు భాద్యతా రాహిత్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారంటూ మంది పడ్డారు. అనంతరం వారికి కూడా కౌన్సలింగ్

నిర్వహించారు. à°ˆ కౌన్సలింగ్ శిబిరం లో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఎస్ ఐ లు, సిబ్బంది, పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam