DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దశల వారీగా  మద్యపాన నిషేదం: మంత్రి ముత్తంశెట్టి  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, అక్టోబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ లో దశల వారీగా  à°®à°¦à±à°¯à°ªà°¾à°¨ నిషేదం అమలు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు క్రీడలు,

యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం విశాఖ లోని ప్రభుత్వ అతిధి గృహం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ

జిల్లాలో ప్రస్తుతం 297 వైన్ షాపులు ప్రభుత్వ పరంగా నడుస్తున్నట్లు తెలిపారు. వీటిలో 1130 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, జిల్లా లో ఇంకా 24 వైన్ షాపులు ఏర్పాటు

చేయాల్సి ఉందన్నారు. నాటు సారా కాయకుండా విజిలెన్స్ పెంచామని, అనకాపల్లి పరిధిలో 50 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వాలంటీర్లు మహిళా పోలీసులు సహాయం తో నిఘా

పెంచుతామని, à°—à°¤ నాలుగు నెలల్లో 21 వేల కెజిల గంజాయి పట్టుకున్నట్లు చెప్పారు. గంజాయి స్మగ్లింగ్ అరికడతామని పేర్కొన్నారు. 

హౌసింగ్ కు ఆర్ధిక సహాయం

 :

మహా విశాఖ నగరం పరిధిలో, మున్సిపాల్టీల లో 60 గజాల లోపు స్వంత స్థలం ఉన్న వారు ఇళ్లు నిర్మించడానికి శత శాతం సబ్సిడీ తో 2.50 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు.

ప్రజలు వార్డు వాలంటీర్లు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 

భూ కుంభకోణం పై సిట్

ముఖ్యమంత్రి పాదయాత్ర లో ఇచ్చిన హామీ మేరకు సిట్ వేసినట్లు

చెప్పారు.  à°°à±†à°µà°¿à°¨à±à°¯à±‚, పోలీసు యంత్రాంగం పై నమ్మకం కలిగేలా నిస్పక్షపాతంగా నిగ్గు తేల్చుతామన్నారు. ఏ ఒక్క బాధితులు నష్టపోకుండా న్యాయంచేస్తామన్నారు. సిట్

నివేదిక మూడు నెలల్లో వస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ ఉప కమిషనర్ శ్రీనివాసరావు, ఇఎస్ లు దాసు, అన్నపూర్ణ, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam