DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రతి నియోజక అభివృద్ధి కి రూ. 15 కోట్ల కేటాయింపు

నవంబరు 1 నుండి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు 

రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . .

.

విశాఖపట్నం, అక్టోబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం జిల్లాలోని నియోజక వర్గానికి 15 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు

క్రీడలు, యువజన సర్వీసుల శాఖమంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ నియోజక వర్గానికి 15

కోట్ల రూపాయల కేటాయించిన నిధులను గ్రామాల్లో ఎక్కడైతే గ్రామ సచివాలయ భవనాలు పూర్తిగా లేవో అక్కడ గ్రామ సచివాలయ భవనాలు నిర్మించాలని, త్రాగునీరు లేని గ్రామాలకు

త్రాగునీరు కల్పన, కాలువలు, సి.సి. రోడ్లు నిర్మాణం వంటి మౌళిక వసతులు చేపట్టాలన్నారు.  à°†à°¯à°¾ నియోజక వర్గాల శాసన సభ్యులతో పనులు ఎక్కడ చేపట్టాలో చర్చించి నిర్ణయం

తీసుకోవాలని, అనంతరం ప్రతిపాదనలు తయారు చేసి టెండర్లు పిలిచి నవంబరు 1 వ తేది నుండి పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభించి జనవరి నాటికి పనులు పూర్తిచేసి జనవరి

నెలలోనే స్థానిక శాసన సభ్యులతో ప్రారంభోత్సవాలు జరపాలన్నారు.  à°¨à°¾à°¡à±-నేడు స్కూలు భవనాలు కాంపౌండ్ వాల్స్, మధ్యాహ్నన భోజన వంట గదులు, మరుగదొడ్లు, తదితర మౌళిక వసతులు

ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు కలెక్టర్ కు పంపాలని చెప్పారు. జివియంసిలోని నియోజక వర్గాలకు 200 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందని, యుద్ధప్రాతిపదికన

అభివృద్థి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని, అత్యవసరమైన పనులను ఆయా నియోజక వర్గాల్లో తాను లేదా శాసన

సభ్యులు శంఖుస్థాపన చేస్తారని చెప్పారు. జిల్లాలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్థి, సంక్షేమం పారదర్శకంగా, అవినీతి రహితంగా జరుగుతాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన

హామీలు అమలుపై ఇంత వరకు దృష్టి సారించడమైనదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కాలువలు, తాగునీరు, సి.సి. రోడ్లు వంటి మౌళిక వసతులు కల్పించడానికి ముఖ్యమంత్రి

సిద్దంగా ఉన్నారని చెప్పారు.  à°®à°¹à°¾à°¤à±à°®à°¾ గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ గ్రామ సచివాలయాల్లో  à°¸à°®à°¸à±à°¯ పరిష్కరించనున్నట్లు

పేర్కొన్నారు.  1,86,000 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారని, వారికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు చెప్పారు.  à°¡à°¿à°¶à°‚బరు నాటికి అన్ని గ్రామాల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు

చేసి జనవరి నెల నుండి పూర్తి స్థాయిలో పనిచేస్తాయన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°²à±‹à°¨à°¿ 13 జిల్లాల్లో విశాఖపట్నం జిల్లాను అభివృద్థి, సంక్షేమాల్లో రాష్ట్రంలో నంబర్ 1à°—à°¾ చేయాలనే

కృషి చేస్తున్నట్లు చెప్పారు.  à°œà°¿.వి.యం.సి. పరిధిలో పనులు వేగవంతం చేయమని కమీషనర్ కు చెప్పినట్లు పేర్కొన్నారు. 
     à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ

జిల్లాకు 150 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందని, అందుకు ప్రతి నియోజక వర్గంలోని ఎక్కడైతే గ్రామ సచివాలయ భవనాలు లేవో అక్కడ నిర్మించడానికి చర్యలు

తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.  à°—్రామీణ, పట్టణ  à°ªà±à°°à°¾à°‚తాల్లో మౌళిక వసతులు కల్పనకు సంబందిత శాసన సభ్యులుతో చర్చించి ప్రతిపాదనలు పంపాలన్నారు.  à°®à±à°–్యంగా గ్రామ

సచివాలయ భవనాల నిర్మాణంనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.  à°…నంతరం గ్రామాల్లో కాలువలు, రోడ్లు, నాడు-నేడు స్కూల్స్ లో కాంపౌండ్ వాల్స్, వంట శాలలు, మరుగుదొడ్లు,

త్రాగునీరు వంటి సదుపాయాలకు కన్వర్జన్సీ నిధులు, ఎస్.ఎస్.à°Ž. నిధులతో చేపట్టనునట్లు తెలిపారు.   70 శాతం ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు, 30 శాతం స్వచ్చ భారత్ నిధులుతో పనులు

చేయడం జరుగుతుందన్నారు.జివియంసి పరిధిలో పనులు వేగవంతం చేయమని ఆదేశించడం జరిగిందని చెప్పారు.
       అంతకు ముందు కలెక్టర్ కార్యాయ సమావేశ మందిరంలో

à°Žà°‚.జి.ఎన్.ఆర్.à°‡.జి.యస్. పై పంచాయితీరాజ్ శాఖ, డ్వామా, డిఆర్డిఎ, తదితర శాఖల అధికారులపై శనివారం మంత్రి సమీక్షించారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°¨à°¿ నియోజక వర్గాల వారీగ గ్రామ సచివాలయ

భవనాలు ఎన్ని ఉన్నవి ఎన్ని కావాలో అధికారులతో చర్చించారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ 924 గ్రామ పంచాయితీలు ఉండగా సచివాలయాల భవనాలు ఉన్నవి 735, భవనాలు లేనివి 384 ఉన్నట్లు కలెక్టర్

తెలిపారు.  à°‡à°‚దులో శాశ్వత భవనాలు లేనివి ఎక్కువగా పాడేరు, అరకు, చోడవరం, తదితర మండలాల్లో ఉన్నట్లు కలెక్టర్ మంత్రికి వివరించారు.
     à°ˆ సమావేశంలో విశాఖపట్నం

పార్లమెంటు సభ్యులు ఎం.వి.వి. సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డా. బి.వి. సత్యవతి, పెందుర్తి శాసన సభ్యులు అన్నపురెడ్డి అదీప్ రాజ్, డ్వామా ప్రాజెక్టు

డైరక్టర్ సందీప్, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, జడ్పి సిఇఓ రమణమూర్తి, డిపిఓ కృష్ణకుమారి, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఇ రవి కుమార్, పంచాయితీరాజ్ ఎస్ఇ రవీంద్ర రెడ్డి, ఇఇలు,

డి.ఇ.లు, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam