DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్పందన కార్యక్రమానికి పలు వినతులు

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚). .

శ్రీకాకుళం, అక్టోబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¸à±à°ªà°‚దన కార్యక్రమానికి పలు  à°µà°¿à°¨à°¤à±à°²à± అందాయి.  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ ఉదయం

కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని స్పందన భవనంలో స్పందన కార్యక్రమం జరిగింది. సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, జిల్లా రెవిన్యూ

అధికారి బి.దయానిధి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు à°Ž.కళ్యాణ్ చక్రవర్తి,  à°—ృహ నిర్మాణ సంస్థ జిల్లా మేనేజర్ à°Ÿà°¿.వేణుగోపాల్ స్పందన కార్యక్రమాన్ని

నిర్వహించారు. పి.మాధురి, వై.భారతి, పి.రెయ్యమ్మ తదితరులు తాము టెక్కలి జిల్లా ఆసుపత్రి ఏపివివిపిలో కాంట్రాక్టు స్టాఫ్ నర్సుగా 2018 నవంబరు నుండి పనిచేస్తున్నానని,

అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి జీతభత్యములు చెల్లించలేదని ఫిర్యాదు చేసారు. ఇప్పటికైనా  à°¤à°¨ జీతభత్యాలను మంజూరుచేయాలని కోరుతూ ఆర్జీని సమర్పించారు. ఆమదాలవలస

నుండి పైడి శృతి ఆర్జీని సమర్పిస్తూ తన తల్లి హిరమండలం మండలం సులభాయ్ యం.పి.యు.పి స్కూల్లో స్కూల్ అసిస్టెంటుగా పనిచేస్తూ 2017 సెప్టెంబరు మాసంలో మరణించారని, తన

తండ్రి నిరుద్యోగి అని, కావున తనకు కారుణ్యనియామకం ద్వారా ఉద్యోగాన్ని ఇప్పించాలని కోరారు. కోటబొమ్మాళి మండలం దుప్పలపాడు నుండి ఎండు అప్పన్న ఆర్జీని

సమర్పిస్తూ తమ గ్రామంలోని చెరువు గర్భం సర్వే నెంబరు 68నందు 30 సెంట్లు చొప్పున డి-పట్టాలను యస్.సిలకు మంజూరుచేసారని, వాటిలో పంటలను పండించుకొనుటకు అనుమతిని

మంజూరుచేయాలని కోరారు. కవిటి మండలం కపాసుకుద్ది నుండి పరిమెళ్ల కృష్ణారావు ఆర్జీని ఇస్తూ తమ గ్రామంలోనికి ప్రవేశించే రహదారి పూర్తి అధ్వాన్నంగా ఉందని,

దీనివలన చాలా సమస్యలు ఎదురౌతున్నాయని, కావున రహదారిని బాగుచేయించాలని కోరారు. పోలాకి మండలం ప్రియాగ్రహారం నుండి కోరాడ మురికిరాజు ఆర్జిని సమర్పిస్తూ రాళ్లపాడు

గ్రామం వద్ద వంశధార నీరు వృధాగా పోతుందని, కావున దానిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. శ్రీకాకుళం కాకివీధి నుండి సూరపురెడ్డి హైమావతి ఆర్జీని

సమర్పిస్తూ తనకు ముగ్గురు కుమారులు ఉన్నారని, తన భర్త మరణానంతరం తన వద్ద ఉన్న బంగారంతో పాటు దస్తావేజులను ఫోర్జరీ చేసి తన కుమారులు తీసుకున్నారని, చివరకు తన

భర్తకు చెందిన పింఛను కూడా తనకు అందకుండా చేస్తున్నారని, కావున తగిన న్యాయం చేయాలని ఫిర్యాదు చేసారు. శ్రీకాకుళం హరిజనవీధి నుండి రాడ పెంటయ్యనాయుడు ఆర్జీని

సమర్పిస్తూ తాను 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ఐటిఐ డీజిల్ మెకానిక్ చేసియున్నానని, అయితే తనకు ఎటువంటి ఉద్యోగం లేదని కావున తనకు గ్రామ సచివాలయ

పోస్టును మంజూరుచేయాలని కోరారు. హిరమండలం మండలం చినకొల్లివలస నుండి గంటేడ గోవిందరావు ఆర్జీని సమర్పిస్తూ తనకు అంతిలి రెవిన్యూ గ్రాఫ్ లో గల సర్వే నెంబరు 109-8లో 50

సెంట్ల జిరాయితీ భూమి తన తండ్రి నుండి సంక్రమించిందని, కావున తనకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేయాలని కోరారు. గార మండలం తండ్యాలపేట నుండి చిన్నాల దాలయ్య

ఆర్జిని సమర్పిస్తూ తనకు చెందిన 44 సెంట్ల స్థలానికి సంబంధించిన అడంగళ్ మంజూరు చేయడం లేదని, కావున దానిని మంజూరుచేయాలని కోరారు. కోటబొమ్మాళి మండలం నారాయణవలస

నుండి ఉర్జాన శిమ్మయ్య ఆర్జిని సమర్పిస్తూ సర్వే నెం.48-14బిలో గల భూమికి అడంగళ్ మంజూరుచేయడం లేదని, కావున అడంగళ్ మంజూరుచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో

గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీరు టి.శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె.వి.ఆదిత్యలక్ష్మీ, బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక

సంచాలకులు జి.రాజారావు, యస్.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు సిహెచ్.మహాలక్ష్మీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి  à°¡à°¾. యం.చెంచయ్య, మత్స్య శాఖ సంయుక్త

సంచాలకులు డా. వి.వి.కృష్ణమూర్తి , గృహ నిర్మాణ సంస్థ జిల్లా మేనేజర్ టి.వేణుగోపాల్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు జీవన్ బాబు,

సూక్ష్మ నీటిపారుదల శాఖ పథక సంచాలకులు జమదగ్ని, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam