DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డయల్ యువర్ కలెక్టర్ కు 10 వినతులు

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌): డయల్ యువర్ కలెక్టర్ కు 10 వినతులు వచ్చాయి. సోమవారం ఉదయం

కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎ.కళ్యాణ్ చక్రవర్తి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మెళియాపుట్టి నుండి కె.సంధ్య ఫోన్ చేసి మాట్లాడుతూ తమ గ్రామంలో తాగునీటి సమస్య ఉందని, తాగునీరు కోసం కిలోమీటరు దూరం ప్రయాణించవలసి వస్తుందని, కావున తాగునీటి

సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆమదాలవలస మండలం దూసి నుండి కె.శ్రీనివాసులు మాట్లాడుతూ తమ గ్రామంలో అనర్హులకు ఇంటి స్థలాల జాబితాలో పేర్లను నమోదుచేసారని, కావున

అర్హులకు ఇంటిస్థలాలను ఇప్పించి తమకు న్యాయం చేయాలని కోరారు. మందస మండలం హరిపురం నుండి ఇ.వెంకటరావు మాట్లాడుతూ తమ గ్రామంలోని రుద్రభూమిలో మొక్కలు బాగా

పెరిగిపోయాయని వాటిని తొలగించాలని, అదేవిధంగా పారిశుద్ధ్యం బాగాలేదని ఫిర్యాదు చేసారు. టెక్కలి మండలం బూరగాం నుండి జె.చినబాబురెడ్డి మాట్లాడుతూ తమ గ్రామంలోని

మాజీ సర్పంచ్ తమ కొళాయి కనెక్షనుకు మోటారును బిగించడం వలన ఇతరులకు నీటి సరఫరా సక్రమంగా రావడం లేదని, కావున తమకు నీటి సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదు చేసారు.

బూర్జ మండలం చిననల్తాడ నుండి జి.కృష్ణారావు మాట్లాడుతూ అర్హడైన తనకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేయలేదని, కావున తనకు తగిన న్యాయం చేయాలని ఫిర్యాదు చేసారు.

పొందూరు మండలం రాపాక నుండి కె.సూరీడు ఫోన్ చేసి మాట్లాడుతూ తమ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు కూడా లేవని ఫిర్యాదు చేసారు. జి.సిగడాం మండలం

టంకాల దుగ్గివలస నుండి యస్.గోపాలనాయుడు మాట్లాడుతూ దేవుడు భూములు కలిగిన పూజారులకు కౌలు రైతులుగా గుర్తించి రైతుభరోసా పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని

కోరారు. రేగిడి ఆమదాలవలస మండలం పెద్దపల్లి నుండి కె.శ్రీదేవి మాట్లాడుతూ తనకు గృహం మంజూరుకానప్పటికీ బిల్లులు మంజూరయ్యాయని ఫిర్యాదు చేసారు. సరుబుజ్జిలి మండలం

బుడ్డివలస నుండి వి.గోవిందరావు మాట్లాడుతూ అర్హులైన తమకు రైతు భరోసా పథకాన్ని వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. టెక్కలి నుండి పి.చిట్టెమ్మ ఫోన్

చేస్తూ తన భూమికి చెందిన పొజీషన్ సర్టిఫికేటును తహశీల్ధారు మంజూరుచేయడం లేదని ఫిర్యాదు చేసారు.

        à°ˆ కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం

పర్యవేక్షక ఇంజినీరు టి.శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె.వి.ఆదిత్యలక్ష్మీ, బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు,

యస్.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు సిహెచ్.మహాలక్ష్మీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి  à°¡à°¾. యం.చెంచయ్య, మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు à°¡à°¾.

వి.వి.కృష్ణమూర్తి , గృహ నిర్మాణ సంస్థ జిల్లా మేనేజర్ టి.వేణుగోపాల్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు జీవన్ బాబు, సూక్ష్మ

నీటిపారుదల శాఖ పథక సంచాలకులు జమదగ్ని, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam