DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ప్రజల అవసరాలు, కష్టాలు గుర్తించండి

ప్రభుత్వ సంస్థలకు జిల్లా మంత్రి అవంతి సూచన 

(DNS రిపోర్ట్ : CVS సాయిరాం, బ్యూరో , విశాఖపట్నం). .

విశాఖపట్నం , అక్టోబర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌): కేంద్ర ప్రభుత్వ సంస్థలైన

నేవీ రైల్వే సంస్థలు విశాఖ నగర జిల్లా ప్రజల అవసరాలను ఇబ్బందులను గుర్తించి వాటికి తగినట్లుగా విమాన రైల్వే సర్వీసులను ప్రారంభించాలని పర్యాటక శాఖ మంత్రి

ముత్తంశెట్టి శ్రీనివాస రావు కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు పది పదిహేను విమాన సర్వీసులు నడపడానికి

సంస్థలు సిద్ధంగా ఉన్నప్పటికీ నేవీ నిబంధనల విధింపు మూలంగా సర్వీసులు రావట్లేదని చెప్పారు. కొత్త రైల్వే జోన్ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు పనులు

ప్రారంభించలేదని, కొత్త రైళ్లను ప్రారంభించకుండా నడుస్తున్న రైళ్లను విశాఖ స్టేషన్ కి రాకుండా దువ్వాడ మీదుగా నడుపుతున్నారని అన్నారు. దీని మూలంగా

రాష్ట్రంలోని ప్రధాన నగరమైన విశాఖపట్నం రవాణా సౌకర్యాల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి దృష్టికి తీసుకు వెళ్లారు. సర్వీసులను మార్పు

చేసినపుడు రద్దు చేసినప్పుడు ప్రజాప్రతినిధులకు తెలియజేయాలన్నారు. విమాన రైళ్ల సమయాలను కూడా ప్రయాణికుల అవసరాల మేరకు నిర్ణయించాలి అన్నారు. ఎక్కువ ఆదరణ కలిగిన

సర్వీసులను పెంచకపోగా రద్దు చేయడం విచారకరమని పేర్కొన్నారు. దేశ రక్షణ విషయంలో ప్రాధాన్యత గల నౌకా దళాన్ని గౌరవిస్తూ ఈ ప్రాంత ప్రజలు నక్కపల్లి నౌకకేంద్రాన్ని,

వివిధ పరిశ్రమలను త్యాగం చేశారన్నారు. ఎన్ ఏ ఓ బి నిర్మాణంలో భాగంగా భూములు, జీవనాధారం కోల్పోయిన నిర్వాసితులు బాధితులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని, వారి

దైనందిక జీవనోపాధికి కూడా ఆటంకం కలిగిస్తూ నిర్మాణాలు చేపట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్నీ పరిశీలించి తగిన తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా

మంత్రి కోరారు.

ఈ విషయంలో రైల్వే, నేవీ అధికారుల తీరు పట్ల జిల్లాలోని శాసన సభ్యులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ద్రోణంరాజు

శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి పార్లమెంటు సభ్యులు ఢిల్లీ స్థాయిలో మాట్లాడి న్యాయం గెలిపించాల్సిందిగా కోరారు. కేంద్రం నుండి ఆదేశాలు వస్తేనే ఇక్కడ

అధికారులు స్పందిస్తారని తెలిపారు.

నౌకాదళ అధికారులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజల సమస్యలను గుర్తించామని దీనిపై ఉన్నతాధికారులకు నివేదించి

పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వే డిఆర్ఎం శ్రీవాస్తవ మాట్లాడుతూ ప్రభుత్వం తమకు 52 ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సి ఉందని, స్థలం కేటాయించిన

వెంటనే జోనల్ కేంద్రం పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రయాణికుల అవసరాలను బట్టి కొత్త రైళ్లను కొత్త బోగీలను అందిస్తామని చెప్పారు. అరకు పెందుర్తి సింహాచలం

రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. విశాఖ ఉత్సవ్ పోస్టర్లను రైళ్ల ద్వారా ప్రచారం చేసేందుకు అంగీకరించారు.

తర్వాత ఇటీవల

కురిసిన వర్షాలకు వ్యవసాయ రంగానికి, రోడ్ల కు జరిగిన నష్టాన్ని గూర్చి సమీక్షించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రెండు ప్రధాన రహదారులు

జాతీయ రహదారులు గా అభివృద్ధి చేయనున్నారని, అయినప్పటికీ వాటి మరమ్మతులు జిల్లా ఆర్అండ్బీ అధికారులు చూసుకోవాలని చెప్పారు ఆదేశించారు. ఆర్ అండ్ బి

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పంచాయతీరాజ్ పర్యవేక్షణ ఇంజనీరు  à°œà°°à°¿à°—à°¿à°¨ నష్టాలను గూర్చి వాటిని పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను గురించి వివరించారు.

à°ˆ

సమావేశంలో ప్రభుత్వ విప్ పూడి ముత్యాల నాయుడు, వి ఎం ఆర్ డి ఎ అధ్యక్షులు డి.శ్రీనివాస్ పార్లమెంటు సభ్యులు ఎం వి వి సత్యనారాయణ, డా. బీవీ సత్యవతి, జిల్లా కలెక్టర్

వినయ్ చంద్, వి.యమ్. ఆర్. à°¡à°¿. à°Ž. కమిషనర్ పి కోటేశ్వరరావు జీవీఎంసీ కమిషనర్ à°¡à°¾. జీ. సృజన, జాయింట్ కలెక్టర్ ఎల్.  à°¶à°¿à°µà°¶à°‚కర్, జెసి 2 à°Žà°‚.వీ.సూర్య à°•à°³, రైల్వే డిఆర్ఎం శ్రీవాత్సవ,

నౌకా దళ అధికారులు అరవింద్, సుజిత్ రెడ్డి భట్, సభ్యులు సెట్టి పాల్గుణ, కే భాగ్యలక్ష్మి, యు వి సూర్యనారాయణ రాజు, గొల్ల బాబురావు, జి. అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, తిప్పల

నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam