DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎవరూ చూడకపోయినా పని సక్రమంగా చెయ్యడమే సమగ్రత 

సమగ్రతను  à°œà±€à°µà°¨ విధంగా మారాలి - రతన్ రాజ్

విద్యార్థులకు  à°¹à±†à°šà± పీసీఎల్ ఈడీ సూచనలు  

ఐఐఎం - వైజాగ్ లో విజిలెన్స్ వారోత్సవాలు   

(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS , Bureau, DNS): ..  . .

విశాఖపట్నం, అక్టోబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌) : సమగ్రత జీవన విధంగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (  à°¹à±†à°šà±

పీసీఎల్ ) ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వి. రతన్ రాజ్ సూచించారు. మంగళవారం విశాఖ నగరంలోని ఐఐఎం (ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మానేజ్ మెంట్ ) లో జరిగిన విజిలెన్స్

వారోత్సవాల్లో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి అమూల్యమైన సూచనలు చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విద్యార్థి దశలో నేర్చుకునే

అంశాలను జీవన విధానంలో అమలు చేస్తూ సమాజానికి పూర్తి మేలు జరిగేలా తమను తాము తీర్చి దిద్దుకోవాలన్నారు. ఎవరూ మిమ్మల్ని గమనించకపోయినా చేసే పనిని సక్రమంగా

నెరవేర్చడమే సమగ్రత అన్నారు. ఈ సందర్బంగా నిత్యం గమనించే అంశాలను ఉదహరించారు. తప్పు చేయడం ఒక్కటే తప్పిదం కాదని, కళ్ళముందు తప్పు జరుగుతున్నా నిరోధించే

ప్రయత్నం చేయక పోవడం అంతకంటే పెద్ద తప్పు అన్నారు. 
ఐఐఎం విశాఖపట్నం డైరక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ స్వామి వివేకానంద సమాజాన్ని ఉద్దేశించి సూచించిన అంశాలను

తెలియచేసారు. à°ˆ కార్యక్రమం లో హెచ్ పీసీఎల్ సి జి à°Žà°‚ ( హెచ్ ఆర్) రాజారావు, ఇతర అధికారులు, ఐఐఎం విశాఖపట్నం -కార్యనిర్వహణ అధికారి  à°Žà°‚ ఎస్ సుబ్రహ్మణ్యం   విద్యార్థిని

విద్యార్థులు పాల్గొన్నారు. à°…నంతరం వివిధ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు పురస్కారాలను అందించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam