DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రమాదకారి రొమ్ము క్యాన్సర్ పై అవగాహన అవసరం 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, అక్టోబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌): అత్యంత ప్రమాదకారిగా రూపుదిద్దుకుంటున్న  à°°à±Šà°®à±à°®à± క్యాన్సర్ పై

ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహనా కల్పించాల్సిన భాద్యత నిపుణులపై ఉందని, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ మెడికల్

ఆంకాలజిస్ట్ డాక్టర్. రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం విశాఖ నగరం లోని వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో

నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రొమ్ము క్యాన్సర్ భారతదేశంలో మూడవ అతి సాధారణ క్యాన్సర్ గా ఉందని, మహిళ లో రెండవ అతి సాధారణ క్యాన్సర్ గా

తయారైందన్నారు. రొమ్ము క్యాన్సర్ తీవ్రత ఊబకాయం, ధూమపానం, మద్యపానం ఇలా పలు కారణాల వల్ల వ్యాప్తి ఇటీవల పరిశోధనలో తేలిందన్నారు. à°ˆ వ్యాధి  10 శాతం మహిళల్లో

 à°µà°‚శపారంపర్యంగా వస్తుందన్నారు. భారత దేశంలో 2018- 19 సంవత్సరాల లో నమోదయిన రొమ్ము క్యాన్సర్ కేసులు 20 లక్షలు పైగా ఉన్నాయన్నారు. క్యాన్సర్ నివారణకు ఆరోగ్యవంతమైన ఆహార

అలవాట్లు, వ్యాయామం తప్పనిసరని తెలిపారు. ఈ క్యాన్సర్ వల్ల మహిళల మరణాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదవుతుందన్నారు. ఈ వ్యాధి లక్షణాలను మొదటి

గుర్తించినట్లయితే త్వరితగతిన నివారించడానికి అవకాశం ఉంటుందన్నారు.  50 నుంచి 74 సంవత్సరాల వయసుగల మహిళల్లో ప్రతి రెండు సంవత్సరాలకు స్క్రీనింగ్

చేసుకోవాలన్నారు. కొంతమంది అల్ట్రాసౌండ్ చేయించుకోవాలని సూచించారు. చాలామంది ప్రజలకు రొమ్ముక్యాన్సర్ ఏ కారణం చేత వస్తుందో తెలియడం లేదన్నారు.   à°ˆ సమావేశంలో

ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam