DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నీతి నియమాలే ఉద్యోగులకు రక్ష: షకీలా భాను

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, అక్టోబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°‰à°¦à±à°¯à±‹à°—ులు నిజాయితీతో, నిబద్ధతతో విధులు నిర్వహించి నట్లయితే  à°—ౌరవం, కుటుంబానికి రక్షణ

ఉంటుందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అదనపు ఎస్. పి. షేక్ షకీలా భాను చెప్పారు. విజిలెన్స్ అవగాహన వారం సందర్భంగా   బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో

ఏర్పాటుచేసిన  à°…వినీతిని అరికడదాం - సమాజాన్ని కాపాడుదాం అనే అంశంపై ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన షకీలా భాను

మాట్లాడుతూ అవినీతి నిర్మూలన మన అందరి బాధ్యత అని, నిజాయితీగా బతకడం అనే జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల పై వచ్చిన ఎటువంటి ఫిర్యాదు నైనా

క్షుణ్ణంగా పరిశీలిస్తామని, పూర్తి వివరాలను సేకరించి నిజనిర్ధారణ చేస్తామన్నారు.1961 నుండి అవినీతి నిరోధక శాఖ రాష్ట్రంలో పని చేస్తున్నదని, కేంద్రంలో సి.బి.ఐ.

ఉంటుందని తెలిపారు.  à°²à°‚చగొండులను వల పన్ని పట్టుకోవడం(ట్రాపింగ్), ఆదాయానికి మించి ఉన్న ఆస్తులను జప్తు చేయడం చేస్తామన్నారు. 

డి.ఎస్.పి. కే. రంగరాజు

మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వారోత్సవాలను నిర్వహిస్తామని, ఉద్యోగులకు ఏసీబీ పై అవగాహన కల్పిస్తామని చెప్పారు. అవినీతి కేసులో దొరికిన ట్లయితే ఉద్యోగం పోవడమే

కాక కుటుంబ గౌరవం పోతుందని, సమాజంలో చులకన అయి పోతారని తెలిపారు.ఏ కారణం చేతనైనా అవినీతి బాట పడితే జీవితం అధోగతి పాలు అవుతుందన్నారు. సేవా భావంతో విధులు

నిర్వహించాలని అవినీతి జోలికి పోకూడదు అన్నారు.  à°…ంతేకాకుండా అవినీతి పరుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ విధి విధానాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని

మసలుకోవాలి అన్నారు. వర్క్ షాప్ కు హాజరైన ఉద్యోగులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు కె.లక్ష్మణ మూర్తి, ఎస్ రమేష్, జి

అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam