DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ పాలనలో విశాఖ నగరానికి మహర్దశ పడుతుంది. 

సిఐఐ సమిట్ లు అన్నారు  - కోట్లకు అప్పులు ముంచారు. . .

భూ బకాసురులను రక్షించేందుకేనా ఉత్తుత్తి సిట్ లు: . .

మీడియా చట్టం కొత్తగా పెట్టింది కాదు : . .

బాబు దత్తపుత్రుడే . . .  à°ªà°µà°¨à± కళ్యాణ్ : . . .

ఢిల్లీ లో ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రతినిధి విజయ సాయి రెడ్డి 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,

 à°µà°¿à°¶à°¾à°–పట్నం) : . .

విశాఖపట్నం, అక్టోబర్ 31, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¯à±à°µà°•à±à°¡à±, అత్యున్నత మేధాశక్తి, సుదూర ఆలోచనలు గల్గిన యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో

విశాఖ నగరానికి మహర్దశ పడుతుందని ఢిల్లీ లో ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రతినిధి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి,  à°Žà°‚పీ, వి. విజయ సాయి రెడ్డి

ప్రకటించారు. గురువారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ విశాఖ సమగ్రాభివృద్ధికి ఆయన కంకణం కట్టుకున్నారు. గతంలో వైఎస్సార్ మాత్రమే

విశాఖను అభివృద్ధి చేశారు. సాంస్కృతిక, ఆర్ధిక రాజధానిగా విశాఖ ఎదుగుతుందన్నారు. 

ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలు నవంబర్ ఒకటిన ఘనంగా నిర్వహించుకుంటామని

తెలిపారు. గత పాలనలో చంద్రబాబు ఈ ఉత్సవాలను అటక ఎక్కించారని, తెలంగాణ మోజుతో ఆయన జూన్ 2 నుంచీ వారంపాటు నవనిర్మాణ దీక్ష అంటూ బెంజి సర్కిల్లో ట్రాఫిక్ ఇబ్బందులు

పెడుతుండే వారన్నారు. ఆయన పాలనలో 97 వేలకోట్ల అప్పు రెండున్నర లక్షల కోట్లకు పెరిగింది. ఇందులో అత్యధికం దురుపయోగమైంది. నిధులు ఇవ్వకుండా పథకాలు పెట్టారని

మండిపడ్డారు. 

సిఐఐ సమిట్ లు అన్నారు  - కోట్లకు అప్పులు ముంచారు. . .

విశాఖలో జరిపిన పార్టనర్షిప్ సమ్మిట్లలో లక్షల కోట్ల పెట్టుబడి అని ప్రచారం చేశారు.

పార్టీ నేతలకు స్టార్ హోటళ్లలో విలాసాలు ఏర్పాటు చేశారన్నారు. కేవలం  à°•à±‹à°Ÿà±à°²à°¾à°¦à°¿à°—à°¾ హోటళ్ల బిల్లు మాత్రం పెంచారన్నారు.  

భూ బకాసురులను రక్షించేందుకేనా

ఉత్తుత్తి సిట్ లు: . .   

మంత్రులు, పార్టీ నేతలు, ఇతర అనుయాయులు నిందితులుగా ఉన్న భూకుంభకోణాల మీద ఉత్తుత్తి సిట్ ల ను వేసింది దోషులను రక్షించేందుకేనా అని

అడిగారు. దీని పరిధి పెంచుతూ నిబద్దత కల్గిన అధికారులతో కొత్త సిట్ ఏర్పాటు చేశామన్నారు.  

ముందు ఇసుక కొరత అన్నారు. ఇపుడు ఇసుక మాఫియా, ఇసుక దోపిడి

అంటున్నారు. అది నిరూపించాలి. లేదా రాజకీయాల నుంచి వైదొలగండి అని హెచ్చరించారు. శాంతి భద్రతలను అత్యంత ప్రాధాన్యంగా వైకాపా సర్కారు తీసుకుంది. అవినీతి అరికట్టి

ప్రజారంజక పాలనను రానున్న పాతికేళ్లపాటు జగన్ పాలన సాగుతుందని జోస్యం చెప్పారు.  

చంద్రబాబు భూకుంభకోణాల మీద వేసిన సిట్ రిపోర్టు ఇచ్చినా దాన్ని బహిర్గతం

చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆ రిపోర్టు పరిశీలించి, అందులో మంత్రులను రక్షించే ప్రయత్నం జరిగిందని గుర్తించి, ఇంకా విస్తారంగా విచారణ జరిపించాలని

నిర్ణయించింది. దీని పరిధి ఇతర ప్రాంతాలకు పెంచాలని, సమయం కూడా పెంచాలనీ కోరాం.
 à°…మరావతి మీద శివరామకృష్ణ కమిటీ నివేదికను, నారాయణ కమిటీ నివేదికనూ పరిశీలించి

కొత్త కమిటీ సిఫార్సులను అనుసరించి నిర్ణయం తీసుకుంటారు. à°à°ªà±€à°²à±‹ 13 జిల్లాలూ సమంగా అభివృద్ధి చెందాలని జగన్ బలంగా ఆశిస్తున్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా

రంగాలను సమంగా సమగ్రంగా అభివృద్ధి చేస్తాం అన్నారు. 

మీడియా చట్టం కొత్తగా పెట్టింది కాదు : . . . 

 à°®à±€à°¡à°¿à°¯à°¾ దుష్ప్రచారం చేస్తే సివిల్, క్రిమినల్ చర్యలకు

ఎప్పటినుంచో అవకాశం ఉంది. ఇపుడూ అవే చట్టాలున్నాయి. వాటిని మార్చటం ఎవరివల్లా కాదు. వార్తని వార్తగా రాయాలి. వ్యాఖ్య చేస్తే దానికి ఆధారం ఉండాలి. విమర్శ సహేతుకంగా

ఉండాలి. లేదా చట్టం తన పని తాను చేసుకుంటుంది. కొన్ని పత్రికల యజమానులు జర్నలిస్టులు కారు. సాధారణ జర్నలిస్టులు భయపడనవసరం లేదు అని భరోసా ఇచ్చారు. 

బాబు

దత్తపుత్రుడే . . .  à°ªà°µà°¨à± కళ్యాణ్ : . . . 

పవన్ కల్యాణ్ చంద్రబాబు దత్త పుత్రుడు. 2014 లోనే అమ్ముడుపోయాడు. ఆ కాల్షీట్స్ ఇంకా అమల్లో ఉన్నాయి. ఇంకా అవే నడుస్తున్నాయి.

అందుకే రెండు చోట్ల ఓడించారని తెలిపారు.  à°šà°¿à°¨à±à°¨à°¨à°¾à°¯à±à°¡à± అయిదేళ్లు తిని ఇపుడు నాలుగు గంటలు దీక్ష చేస్తే లాభం లేదు. ఇసుక దీక్ష హాస్యాస్పదంగా

సాగిందన్నారు. 

ఈ సమావేశంలో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam