DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పెద్దశేష వాహనం పై  మాడవీధుల్లో మ‌ల‌య‌ప్ప సాక్షాత్కారం 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, అక్టోబర్ 31, 2019 (డిఎన్‌ఎస్‌): నాగులచవితి à°ª‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని గురువారం రాత్రి శ్రీ‌దేవి,

భూదేవి à°¸‌మేత శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేషవాహనంపై à°­‌క్తులను à°•‌టాక్షించారు. రాత్రి 7 నుండి 9 à°—à°‚à°Ÿà°² నడుమ స్వామి, అమ్మ‌వార్లు తిరుమాడ వీధుల్లో à°¦‌ర్శ‌à°¨‌మివ్వ‌à°—à°¾

పెద్ద‌సంఖ్య‌లో à°­‌క్తులు à°¦‌ర్శించుకున్నారు. 

          సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష

సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలందు కుంటున్నాడు. అటు

రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ

విధంగా స్వామివారు దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి

ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తున్నాడు. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవ వాహనసేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇచ్చారు.
          à°ˆ కార్య‌క్ర‌మంలో

శ్రీ‌వారి ఆల‌à°¯ పేష్కార్  à°²à±‹à°•‌నాథం, విఎస్వో à°®‌నోహ‌ర్, బొక్కసం బాధ్యులు గురురాజారావు ఇత‌à°° అధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam