DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పత్రికా స్వేచ్ఛ దుర్వినియోగమవుతోందన్నది నిర్వివాదం

పత్రికా స్వేచ్చకీ పరిమితులున్నాయి. .. 

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, నవంబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : వైఎస్

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదో పత్రికా స్వేచ్ఛని కాలరాసినట్లు మీడియాలో ఒక వర్గం దుష్ప్రచారం ప్రారంభించిందని అనకాపల్లి ఎమ్మెల్యే, వైకాపా రాష్ట్ర అధికార

ప్రతినిధి గుడివాడ అమర్ నాధ్ మండిపడ్డారు. శుక్రవారం నగరం లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ కూడా భావ

ప్రకటనా స్వేచ్ఛ మాదిరే రాజ్యాంగంలో à°ªà°°à°¿à°§à°¿à°¤à±à°²à°¤à±‹ కూడి ఉందన్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం హరింపజాలదని తెలిసీ ప్రచారం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం

అధికార వికేంద్రీకరణ చేస్తోందని తెలిపారు. గ్రామ సచివాలయాల స్థాయికి పాలన తీసుకు వెళ్లిందని తెలిపారు. అలాగే అవాస్తవాలు, దుష్ప్రచారాలూ, బురదజల్లడాలూ జరిగితే

ఆయా శాఖల కార్యదర్శులే ఖండనలు ఇచ్చేలా, ఇతర చర్యలు తీసుకునేలా జీవో ఇచ్చారన్నారు.  à°¦à±€à°¨à°¿ వల్ల పత్రికా స్వాతంత్య్రనికి à°­à°‚à°—à°‚ ఎక్కడ కలుగుతుందని ప్రశ్నించారు.

అవినీతి, అక్రమాలు, బాధ్యతా రాహిత్యం ఎక్కడున్నా సహించరాదని, చట్టాలకు ఎవరూ అతీతులు కారు అన్నారు. 

ప్రభుత్వం మీద సహేతుక విమర్శ దుష్ప్రచారం కాదని,

యదార్ధాన్ని ఆహ్వానిస్తాం అన్నారు. నిర్మాణాత్మక విమర్శలు స్వీకరిస్తాం, కానీ ప్రభుత్వ ప్రతిష్టను, వ్యక్తి ప్రతిష్టను దిగజార్చి ప్రజల్లో అపోహలు, అనుమానాలు,

తద్వారా వ్యతిరేకత వ్యాప్తి చేసే వారికి అదుపు తప్పదు అన్నారు. 

పత్రికా వ్యవస్థ మీద జగన్ గారికి అపారమైన గౌరవం ఉందని, కానీ రాజకీయ ఎజెండాతో దుష్ప్రచారాలు

జరిగితే, అప్రదిష్టపాలు చేస్తే ఎదుర్కొనే హక్కు ప్రభుత్వ శాఖలకు ఉందని తెలియచేసారు. 

సిబిఐ కోర్టులో హాజరు మినహాయింపు నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పుమీద

అప్పుడే à°Žà°‚à°¤ దుష్ప్రచారం మొదలైందో చూస్తున్నాం. జగన్ మీద బనాయించిన కేసులన్నీ రాజకీయ కుట్రతో పెట్టినవేనన్నారు. 

వాటిని జనం నమ్మలేదు కనుకే ఇంత భారీ

ఎత్తున గెలిపించారు. సిబిఐ నిర్ణయం మీద హైకోర్టుకి సుప్రీం కోర్టుకి వెళతారు.. కోర్టు రాజ్యాంగ వ్యవస్థ అయినపుడు దాని ముందుకు వెళ్లటానికి ఇబ్బంది ఎందుకు?

అంతిమంగా జగన్ నిర్దోషిగా బయట పడతారు. కనుక దుష్ప్రచారాలు మానండి.

పవన్ ఇసుక ర్యాలీ- లాంగ్ మార్చ్ పై :. . .
 
పవన్ కల్యాణ్ కొత్తగా విపక్షాలను కలిపేది ఏమిటి? 2014

నుంచీ పవన్ చంద్రబాబుతో కలిసే ఉన్నారు. 2019 లో విడిగా పోటీ చేస్తే ఇరుపార్టీలకూ ఉపయోగమని అలా పోటీ చేశారని, లేకుంటే గాజువాక భీమవరాల్లో బాబు ప్రచారం చేయకపోవటం

ఏంటని ప్రశ్నించారు.  à°µà°¿à°¶à°¾à°– భూ కుంభకోణాల మీద సిట్ పరిధి, వ్యవధి పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతాం అన్నారు. 

ఈ విలేకరుల సమావేశం లో వైఎస్సార్ కాంగ్రెస్

పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam