DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రుల ఆరోగ్యదాయి ఆరోగ్య శ్రీ ఆంధ్రా దాటి విస్తరించింది.  

కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల్లో నూ అమలు. . ..  

ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పని సరిగా ఆంధ్రాలోనే ఉండాలి.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్

అమరావతి) 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రుల ఆరోగ్య దాయి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఆంధ్ర ప్రదేశ్ పరిధి దాటి ఇతర రాష్ట్రాలకూ విస్తరించింది. ఇంతవరకు

కేవలం 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ లోనే ఈ వైద్య సేవలు లభ్యం అవుతుండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీని ప్రస్తుతం అమలు లోకి

తీసుకు వచ్చారు. ఇతర రాష్ట్రాల్లో  à°¨à°¿à°µà°¸à°¿à°‚చే, తాత్కాలికంగా వెళ్లిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చిన సమయాల్లో తక్షణ వైద్య సదుపాయం అందించేందుకు à°ˆ

ఆరోగ్య శ్రీ పధకాన్ని తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ

వేడుకలను పురస్కరించుకుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విజయవాడలో విడుదల చేసారు. 

నేటినుంచి ఇతర రాష్ట్రాల్లోనూ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ

వర్తించనుంది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లో ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌

జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. à°ˆ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్, హైదరాబాద్‌లోని మెడ్‌కవర్‌

ఆసుపత్రుల డాక్టర్లు,  à°…క్కడి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చికిత్సల విధానంపై డాక్టర్లను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. తమ

రాష్ట్రానికి చెందిన వారిని బాగా చూసుకోవాలంటూ వైద్యులను కోరారు. ఎంతో విశ్వాసం, నమ్మకంతో చికిత్సకోసం ఏపీ వారు అక్కడకు వచ్చారని, వారు కోలుకునేంతవరకు తగిన

జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.

ఇతర రాష్ట్రాల్లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వర్తింపుతో రాష్ట్రానికి చెందిన పేదలు à°ˆ ఉదయం

నుంచి  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à±, చెన్నై, బెంగుళూరు నగరాల్లో  à°¨à°¿à°°à±à°£à°¯à°¿à°‚à°šà°¿à°¨ ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందవచ్చు. సుమారు 17 సూపర్‌ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి 716 జబ్బులకు à°ˆ

మూడు నగరాల్లోనూ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
కర్ణాటక లో సుమారు 300 కి పైగా ఆసుపత్రులు, 24 కి పైగా వైద్య పరీక్షల కేంద్రాల్లో ఈ పధకం అమలు లోకి రానుంది.

బెంగుళూరు, మాండ్య, మైసూర్, తదితర ప్రాంతాల్లోనూ అమలు లోకి రానుంది.  
ఈ వైద్య సదుపాయం పొందదలచిన వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డులు కచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ లోనే

నమోదు అయి ఉండాల్సిన అవసరం ఉంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam