DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు లోనే మాట్లాడదాం. . తెలుగులోనే జీవిద్దాం : గంట్ల శ్రీనుబాబు

తెలుగు లోనే మాట్లాడదాం. . తెలుగులోనే జీవిద్దాం. 

పాత్రికేయ సంఘం జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు 

నిరంతర తెలుగు కృషీవలుడు సూరి :

తెలుగు

తల్లికి వందనం. . . అభివందనం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . . .

విశాఖపట్నం, నవంబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : తెలుగు నేలపై పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుగు లోనే మాట్లాడదాం. .

తెలుగులోనే జీవిద్దాం అని అఖిల భారత పాత్రికేయ సంఘం జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని

పురస్కరించుకుని విశాఖపట్నం లోని మద్దిలపాలెం జాతీయ రహదారిపై గల తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు దండు- తెలుగు భాష ప్రచార సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమం లో

విశిష్ట అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను స్పష్ఠంగా తెలుగు భాషలోనే వివరించగలరన్నారు. ఇతర భాషల ప్రభావం సమాజం పై

చూపుతున్నప్పడికి తెలుగు భాషకు ఉన్న ప్రభావం ఎన్నటికీ తరిగి పోదన్నారు. తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రం గా భారత దేశం లో ఏర్పడిన మొట్ట మొదటి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్

అని, ఈ ఏర్పాటును పురస్కరించుకుని నవంబర్ 1 న తెలుగు ప్రజలు వైభవంగా వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. అయితే కొందరి ప్రభావం కారణంగా రాష్ట్ర విభజన జరిగిన

సందర్బంగా గత ప్రభుత్వం ఈ వేడుకలను నిషేధించడం బాధాకరం అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి ఈ వేడుకలను నిర్వహించేందుకు తీసుకున్న

నిర్ణయం హర్షణీయం అన్నారు. 

నిరంతర తెలుగు కృషీవలుడు సూరి :. . . .

తెలుగు భాషను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాల్లోనూ పూర్తిగా అమలు చెయ్యాలి అనే

సంకల్పనతో తెలుగు దండు సంస్థ ను స్థాపించి, నిత్యం ప్రభుత్వాలతో శాంతియుత పోరాటమే చేస్తున్న పరవస్తు ఫణిశయన సూరి అభినందనీయులన్నారు. రాష్ట్ర ప్రభుత్వ

కార్యాలయాల్లో తెలుగు భాషను అమలు చెయ్యడం ద్వారా సామాన్య ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే కార్యాచరణ తెలుస్తుందన్నారు. తెలుగు భాష అమలుకోసం ఈయన సుమారు 40

రోజులకు పైగా విశాఖ వేదికగా నిరాహార దీక్ష చేసిన సందర్భాలూ ఉన్నాయన్నారు. గత పాలకులు తెలుగు భాష అమలుకు ఉత్తుత్తి కమిటీ లు వేసి ప్రజలను మభ్యపెట్టే

ప్రయత్నాల్లో చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ తన ఉద్యమాన్ని మరోసారి సూరి ప్రారంభించారన్నారు. ఈయనకు అండగా విద్యార్థులు, విద్య వేత్తలు, భాష సాహిత్య కారులు

పాల్గొన్నారన్నారు. 

శుక్రవారం జరిగిన రాష్ట్ర అవతరణ కార్యక్రమం లో తెలుగు దండు వ్యవస్థాపకులు పరవస్తు ఫణిశయన సూరి, విద్యావేత్త డాక్టర్ బాల మోహన్ దాస్,

తెలుగు భాషా సాహిత్యకారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తెలుగు తల్లికి ఘనంగా అంజలి ఘటించారు. ఈ క్రమంలో మద్దిలపాలెం కూడలి జై తెలుగు తల్లి, జై జై తెలుగు

 à°¤à°²à±à°²à°¿ నినాదాలతో మారుమ్రోగింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam