DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర లో అధికారం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం : సురేష్ ప్రభు

ఆంధ్ర లో అధికారం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం

కేంద్ర ఆయుష్మాన్ భారత్ నే ఆంధ్ర లో ఆరోగ్య శ్రీ à°—à°¾ మార్చారు  

ఆంధ్ర కి బీజేపీ ఇచ్చినంత నిధులు ఇంకే

రాష్ట్రానికీ ఇవ్వలేదు 

విశాఖ కేంద్రంగా  à°°à±ˆà°²à±à°µà±‡ జోన్ ను ఆమోదించింది  à°¨à±‡à°¨à±‡  

కేంద్ర మాజీ మంత్రి,  à°¬à±€à°œà±‡à°ªà±€ ఎంపీ సురేష్ ప్రభు ప్రకటన 

(DNS రిపోర్ట్

: సాయిరాం CVS , Bureau, DNS) : . . . 

విశాఖపట్నం, నవంబర్ 02, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం ఇస్తే పూర్తి స్థాయి లో అభివృద్ధి పరుస్తామని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సురేష్

ప్రభు ప్రకటించారు. శనివారం నగరం లోని సాగర తీరంలోగల నగర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఇంతవరకూ బీజేపీ కి ఆంధ్ర లో

అధికారం ఇవ్వలేదని, ఒకసారి అధికారం ఇచ్చినట్లయితే కేంద్రం నుంచి రావాల్సిన అన్ని నిధులనూ సమకూరుస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు

ఆయురారోగ్యాలు కలగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అయుష్మాన్ భారత్ పధకాన్ని ప్రారంభించారన్నారు. ఈ పధకం ద్వారా 5 లక్షలు వరకూ ఉచితంగా వైద్యం

చేసుకోగలుతున్నారన్నారు. అయితే ఈ పధకాన్ని ఆంధ్ర ప్రదేశ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ గా మార్చారన్నారు. అయితే మీడియా ప్రతినిధులు ఆరోగ్య శ్రీ

పధకం 2007 లోనే మొదలైందని సురేష్ ప్రభు చెప్పడం తో అయన మాటను సవరించుకున్నారు.  à°ˆ పధకం ద్వారా లబ్ది పొందిన లక్షలాది మందిని కలిసేందుకు తాను పర్యటిస్తున్నట్టు

తెలిపారు.  à°¦à±€à°¨à°¿à°²à±‹ భాగంగానే విశాఖపట్నం వాచినట్టు తెలియచేసారు. 

ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కల్గిన ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

మాత్రమేనన్నారు. ఆంధ్ర లో సైతం పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం బలపడిందని, తెలుగుదేశం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల పట్ల ప్రజలు విసిగిపోయారన్నారు. 

కేంద్ర

పధకాలు చెప్తే పేజీలు నిండుతాయి :. . . 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత ప్రజలకు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ పధకాలను చెప్తూ పొతే పేజీలకు పేజీలు

నిండుతాయన్నారు. ఆయుష్మాన్ భారత్, ముద్ర రుణాలు, సుకన్య యోజన, ఉజ్వల యోజన, కిసాన్ యోజన లాంటి పధకాలు ప్రజలకు చాలా లబ్ది చేకూరుస్తున్నాయన్నారు. 

విశాఖ రైల్వే

జోన్ ను ఆమోదించింది నేనే: . . .   

విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చెయ్యాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలకు తీపి కబురు

అందించే విధంగా దక్షిణ కోస్తా రైల్వే ను ఆమోదించింది తానేనని, తదుపరి అధికారిక ప్రకటన ను పీయూష్ గోయల్ తెలియచేశారన్నారు.  à°°à±ˆà°²à±à°µà±‡ పరంగా ఆంధ్ర ప్రదేశ్, ముఖ్యంగా

విశాఖపట్నం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రైల్వే మంత్రి, రైల్వే బోర్డు దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. ప్రస్తుతం తాను ఆంధ్ర ప్రదేశ్ తరపున ప్రతినిధిగా

రాజ్యసభలో సభ్యునిగా ఉన్నట్టు తెలిపారు. ఇది తన భాద్యతగా అభివర్ణించారు. 

రైల్వే సమస్యలు పరిష్కరిస్తాం :

రైల్వే పరంగా విశాఖపట్నం, విజయనగరం,

శ్రీకాకుళం జిల్లాల ప్రయాణీకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. విశాఖ నుంచి తరలించుకు పోయిన రైళ్లల్లో బెర్తుల్లో కోత తదితర అంశాలను బోర్డు తో

మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. 

à°ˆ విలేకరుల సమావేశాల్లో ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులూ పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam