DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇసుక లాంగ్ మార్చ్: పవన్ ది ఇక ఏకాకి పోరాటమే

ఇసుక లాంగ్ మార్చ్ పవన్ ఏకాకి పోరాటమే. . .. 

లాంగ్ మార్చ్ కు ఒకే అన్న పార్టీలు లాంగ్ హ్యాండ్. 

బీజేపీ,  వామపక్షాలు . .. అందరూ ఒకే మాట. ?

జనసేన పై

దుష్ప్రచారం తగదు. . . : నాదెండ్ల. . .

పవన్ ప్రజా పోరాటానికి ప్రోత్సాహాన్నివ్వండి : వివిఎల్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

విశాఖపట్నం, నవంబర్ 02, 2019 (డిఎన్‌ఎస్‌) :

ఆదివారం ( నవంబరు 3 న) విశాఖ వేదికగా తలపెట్టిన లాంగ్ మార్చ్ కు పవన్ కళ్యాణ్ ఏకాకి పోరాటం తప్పడం లేదు. ఉపాధి లేక రోడ్డెక్కిన లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు

న్యాయం చెయ్యలని కోరుతూ  à°•à±‹à°¸à°‚ జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్ విశాఖ నగరంలోని మద్దిలపాలెం కూడలి నుంచి పాత జైలు రోడ్డు లోని ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా à°—à°²

ప్రాంగణం వరకూ సాగనుంది. ఈ కార్యక్రమ వివరాలను అందించేందుకు జనసేన నాయకులూ, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ ఐపీఎస్ వివి లక్ష్మీనారాయణ, పార్టీ ప్రధాన

కార్యదర్శి తోట చంద్రశేఖర్ లు శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్ని పార్టీలకు పవన్ నేరుగా ఫోన్ ద్వారా సంప్రదించారన్నారు. అయితే ముందుగా సంసిద్ధత

వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కు అభినందనలు తెలిపారు. అయితే వామ పక్షాలకు ఆహ్వానం పలుకగా, బీజేపీ వాళ్ళు వస్తే తాము

హాజరు కామంటూ నిక్కచ్చిగా చెప్పేశారన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి స్పష్టత రాలేదని తెలిపారు. శనివారం సాయంత్రం 4 గంటల వరకూ జనసేన లాంగ్ మార్చ్ లో

పాల్గొనేందుకు ఎవరు పాల్గొంటున్నారని విషయంపై తమ వద్ద కచ్చితమైన వివరాలు లేవన్నారు. దీంతో పవన్ కు పార్టీల సహకారం లభించలేదని తేలిపోయింది. 

సోషల్ మీడియా

లో దుష్ప్రచారం తగదు : . .

రాష్ట్రం లో తలెత్తిన ఇసుక వివాదం పై జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా తలపెట్టిన లాంగ్ మార్చ్ కు కొందరు పనికట్టుకుని సోషల్

మీడియా ల్లో దుష్ప్రచారం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. తమకు స్థానిక ప్రభుత్వ సంస్థల నుంచి పూర్తి అనుమతి లభించిందన్నారు. గత నెల 28 నే తాము పోలీస్

కమిషనర్ కు, విశాఖ మహా నగర పాలక సంస్థ అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని, 30 à°µ తేదీనే తమను ఆయా సంస్థల నుంచి అనుమతులు లభించాయన్నారు. 

మాజీ ఐపీఎస్, విశాఖ లోక్ సభ

అభ్యర్థిగా పోటీచేసిన వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ లక్షలాది మంది బడుగు బలహీన వర్గాల కార్మిక కుటుంబాల కు అండగా నిలిచే ఈ ర్యాలీకి అన్ని వర్గాల నుంచి మద్దతు

లభిస్తోందని, దయచేసి దీన్ని రాజకీయ సమస్యగా చూడవద్దని, పవన్ చేపట్టిన à°ˆ పోరాటానికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరారు. 

కాగా, ఈ ర్యాలీ లో పాల్గొనే జనసేన

కార్యకర్తలు, నాయకుల వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు మద్దిలపాలెం సమీపం లోని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఇంజనీరింగ్ మైదానాన్ని కోరడం జరిగిందని, ముందుగా

అంగీకరించిన వైస్ ఛాన్సలర్, తర్వాత ఇవ్వడం కుదరదని నిక్కచ్చిగా చెప్పడం వెనుక ఎవరి హస్తం ఉందొ అందరికి తెలుసునని జనసేన నేతలు మండిపడుతున్నారు. 

ఈ విలేకరుల

సమావేశంలో జనసేన పార్టీ మీడియా ఇంచార్జి హరి ప్రసాద్, అధికార ప్రతినిధి à°Ÿà°¿. శివ శంకర్,  à°¸à±€à°¨à°¿à°¯à°°à± నేతలు కోన తాతారావు, బొడ్డే పల్లి రఘు తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam