DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన భాద్యత ముఖ్యమంత్రిదే : పవన్

జగన్. . అధికార బాధ్యతల నుంచి పారిపోలేవు: పవన్ హెచ్చరిక 

సమస్య పరిష్కారానికి  à°µà±ˆà°¸à±€à°ªà±€ à°•à°¿ రెండు వారాలు గడువిస్తున్నాం.

ఒక్కొక్కరికి రూ. 50

వేలు...మరణించిన వారికి రూ. 5 లక్షలు ఇవ్వాలి..

ప్రజలు రోడ్డుపై కి వచ్చారంటే ప్రభుత్వం విఫలమైందని అర్థం...

రాజకీయాలు చేయడానికి ఇది ఎన్నికల

సమయమా...??

స్పందించకపోతే అమరావతిలో నడుస్తా..... అదిరిపోతుంది. 

నేను ఉన్నాను. అన్న జగన్నన్న .ఎక్కడ ఉన్నారు? : లోక్ సత్తా 

ఓటు వేసి తప్పు చేసాం. .

ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చెయ్యం :

పది రోజుల్లో ఇసుక సమస్యకు పరిష్కారం చూపిస్తాం : నాగబాబు  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

విశాఖపట్నం, నవంబర్ 03, 2019

(డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర ప్రజానీకం ఆపదలో ఉంటె ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతల నుంచి పారిపోతున్నారని  à°œà°¨à°¸à±‡à°¨ పార్టీ అధిపతి పవన్ కళ్యాణ్

మండిపడ్డారు. ఆకలి కేకలతో రోడ్డెక్కిన లక్షలాది మంది భవననిర్మాణ కార్మికులకు సంఘీభావంగా విశాఖలో చేపట్టిన లాంగ్ మార్చ్ అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో అయన

మాట్లాడుతూ ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించవలసిన భాద్యత ముఖ్యమంత్రిదేనని, దాన్ని వైఎస్ జగన్ విస్మరించారని ఎద్దేవా చేసారు  à°†à°‚ధ్రప్రదేశ్

ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికుల కోసం డిమాండ్స్ తో కూడిన హెచ్చరికలు జారీ చేశారు. గత ఐదు నెలలుగా ఇసుక ను మార్కెట్ లోకి విడుదల చెయ్యకుండా. . . .

తొక్కిపెట్టడంతో లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికులకు పని లేకుండా పోయిందన్నారు. దీనికై ప్రతి ఒక్క కార్మికునికి పనులు లేని కాలానికి నెలకు రూ. 10 వేల చొప్పున

కరువు భత్యం ఇవ్వాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మరణించిన ప్రతి కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు.

ఇసుక టన్ను రూ. 100à°•à°¿ అందించాలి. ఇసుక బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి.  à°…న్ని రీచ్ లు పూర్తి స్థాయిలో తెరిచి ఇసుక అందుబాటులోకి తేవాలి. భవన నిర్మాణ కార్మికుల

సంక్షేమ నిధుల వెంటనే విడుదల చేయాలి. అంటూ ప్లకార్డులు హల్ చల్ చేశాయి. 30 లక్షల భవన నిర్మాణ కార్మికులకు, 10 లక్షల రవాణా కార్మికులైన మాకు పస్తులతో జీవన పోరాటమా?

వైసీపీ నేతలకు జేబులు నింపుకునే ఆరాటమా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తూ కనబడిన ఫ్ల కార్డులు ప్రభుత్వ వ్యతిరేకతను చాటాయి.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర

పరిపాలన అద్భుతంగా పాలన చేస్తే....నేను వెళ్ళి సినిమా లు చేసుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వైసీపీ నేతలు తనను చంద్రబాబు కు  à°¦à°¤à±à°¤à°ªà±à°¤à±à°°à±à°¡à°‚టూ దుష్ప్రచారం

చేస్తున్నారని, అయితే తాను కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు దత్తపుత్రుణ్ణి అంటూ ప్రకటించగానే సభ ప్రాంగణం అంతా హోరెత్తిపోయింది. తనకు రాజకీయాల మీద ఆశలేదు ,

ఆసక్తి కూడా లేదని, ప్రజాక్షేమమే ముఖ్యమని, ఎవరు చేయాల్సిన పని వారు చేస్తే నాకు పార్టీ పెట్టే అవసరం లేదు అన్నారు. 

కార్మిక ద్రోహులకు జీతాలు తీసుకునే

అర్హత లేదు :. . . 

భవన నిర్మాణ కార్మికుల ను రోడ్డున పడేసి చోద్యం చూస్తున్న అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలకు లక్షల రూపాయలు ప్రతినెలా  à°œà±€à°¤à°¾à°²à± తీసుకునే

అర్హత లేదన్నారు. మీరు చేసిన తప్పుకు ఐదు నెలల జీతం తీసుకోకండి అంటూ సలహా ఇచ్చేసారు. ..

ఏ 2 మాటలకూ విలువలేదని, అసలు విజయసాయిరెడ్డి ఏమి మాట్లాడుతున్నారో అతనికే

తెలియదని, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని,  à°«à±à°¯à°¾à°•à±à°·à°¨à± రాజకీయాలకు నేను భయపడను అని తేల్చేసారు. 

సూట్ కేసు కంపెనీ లు పెట్టి ఆర్ధిక వ్యవస్థను తప్పుదారి

పట్టించే విజయసాయిరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారని, దీనికి ప్రధాన కారణం ఎన్నికల్లో తాను ఓడిపోయినందుకట అంటూ హేళన చేశారు. జైలు కు వెళ్లిన వారు

కూడా పాలకులు à°—à°¾ మారడం మన దురదృష్టం అన్నారు. 

ఇసుక సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తక్షణం స్పందించకపోతే అమరావతిలో నడుస్తా.....ఎవరు ఆపుతారో

చూస్తానని హెచ్చరించారు. à°ˆ కార్యక్రమం లో పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలియచేసిన పలువురు తమ ఆవేదనాపూర్వక హెచ్చరికలు తెలియచేసారు. 

లోకసత్తా

ప్రతినిధి భీశెట్టి బాబ్జి మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ చేసిన ప్రధాన నినాదం. . ..   నేను ఉన్నాను. అన్న జగన్నన్న .ఎక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు. 
 
/> భవననిర్మాణ కార్మికుల ప్రతినిధి రాజు మాట్లాడుతూ . .  . తమ జీవితాలను బాగు చేస్తాడని నమ్మి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి à°•à°¿ సుమారు 35 లక్షల మంది నిర్మాణ కార్మికులం ఓటు వేసి

తప్పు చేసాం అని,  . ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చెయ్యం అని తెలిపారు. 

జనసేన నాయకులూ, లోక్ సభ ఎన్నికల అభ్యర్థి కె. నాగేంద్ర బాబు మాట్లాడుతూ తమ పార్టీకి అవకాశం

ఇస్తే ఇసుక పోలిసి ని సవ్యమైన మార్గంలో పెట్టి కేవలం పది రోజుల్లో ఇసుక సమస్యకు పరిష్కారం చూపిస్తాం అని తెలిపారు. 

మాజీ మంత్రులు తెలుగుదేశం నేతలు  à°•à±†.

అచ్చింనాయుడు, అయ్యన్న పాత్రుడు లు  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚  à°µà±ˆà°Žà°¸à± జగన్ మోహన్ రెడ్డి à°•à°¿ పాలనా చేతకాదని, దాదాపు చేతులెత్తేశారన్నారు. 

విశాఖ పాత జైలు రోడ్డు లోని విశాఖ

మహిళా కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి రాష్ట్ర ప్రజానీకానికి పూర్తి భరోసా కల్పించే ప్రయత్నం చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam