DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారానికి ఐదు రాష్ట్రాల సమావేశం.

5 న ఐదు రాష్ట్ర సీఎం లు, దేవాదాయ మంత్రుల సమావేశం

తిరువనంతపురంలో జరిగే సమావేశానికి మంత్రి వెల్లంపల్లి 

కేరళలో అయ్యప్ప భక్తులకు ఇబ్బందులే

ప్రధానాంశం  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°¨à°µà°‚బర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌) : అయ్యప్ప భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టేందుకు

తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, చర్యలపై కేరళ ప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 5 న జరిగే ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాలకు చెందిన ముఖ్య మంత్రులు, దేవాదాయ శాఖల

మంత్రులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆంధ్ర ప్రదేశ్ తరపున దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొనున్నారు. ఈ మేరకు కేరళ

ముఖ్యమంత్రి నుంచి ఆహ్వానం లభించింది. 
గతంలో  à°…య్యప్ప స్వాములు కోసం శబరిమలైలో అతిథి గృహం, వసతి నిర్మాణానికి కేరళ ప్రభుత్వాన్ని స్థలం కేటాయించమని

కోరినట్లు à°ˆ సందర్భంగా గుర్తుచేశారు. 

శబరిమలలోని శ్రీధర్మశాస్త దేవాలయంలో నవంబరు 17 నుంచి మండల, మకరవిల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణ, భక్తులకు

సౌకర్యాల కల్పన, ఇతర అంశాలపై చర్చించేందకు నవంబరు 5న తిరువనంతపురంలో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేవాదాయశాఖ మంత్రులతో సమావేశం జరగనున్న దన్నారు. ఈ సమావేశానికి

హాజరుకావాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఆహ్వానం పంపారు.

ఆంధ్రా ప్రతిపాదనలు : 

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం పంబ సన్నిధిలో టోల్ ఫ్రీ సర్వీస్ ఏర్పాటు

చెయ్యాలి.

రాష్ట్ర పోలీసులు మరియు అధికారులతో  à°•à°²à°¿à°ªà°¿ నీలకంఠ, పంబ బేస్ క్యాంప్ వద్ద శబరిమల సమాచార వ్యవస్థ తో  à°ªà°¾à°Ÿà± తెలుగు అయ్యప్పలు సమాచారం ఇచ్చే విధంగా

ఏర్పాటు చేయాలి...

పంబ మార్గములో ప్రయాణించే బస్సు బోర్డులపై పెద్దగా స్పష్టంగా తెలుగు భాషలో ఏర్పాటు చేయాలి...

నీలకంఠ, పంబ సన్నిధి వద్ద అయ్యప్ప భక్తులు

కు తాగునీరు భోజన అల్పాహార కేంద్రాలను విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేయాలి.

అదనంగా ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam