DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తహశీల్దార్ ని పెట్రోల్ పోసి తగలపెట్టిన ఆగంతుకుడు 

భూ రిజిస్ట్రేషన్ లో ఇబ్బందికర పరిస్థితులే కారణమా ?

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°¨à°µà°‚బర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌) : తెలంగాణ లోని

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ హైదరాబాద్‌ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ లో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌

విజయారెడ్డిపై à°“ దుండగుడు పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. à°ˆ ఘటనలో ఆమె అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతిచెందారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో దుండగుడు తహసీల్దార్‌

ఛాంబర్‌లోకి వెళ్లి à°ˆ ఘాతుకానికి పాల్పడ్డాడు. à°† తర్వాత à°† దుండగుడు కూడా తనకు తాను నిప్పంటించుకున్నాడు. తహసీల్దార్‌ను కాపాడే యత్నంలో మరో ఇద్దరు సిబ్బందికి

కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన తహసీల్దార్‌ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని హయత్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం దుండగుడు కాలిన గాయాలతో బయటకు

పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు

హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఏర్పడిన తర్వాత విజయారెడ్డి తొలి తహసీల్దార్‌à°—à°¾ నియమితులయ్యారు. à°ˆ ఘటనకు భూవివాదమే కారణమై

ఉంటుందని భావిస్తున్నారు. నిందితుడు కాలిన గాయాలతో ఉండటంతో సమీపంలోని ఏదైనా ఆస్పత్రికి వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam