DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవన్ క్షమాపణ చెప్పాల్సిందే : MLA పంచకర్ల 

పవన్‌ కళ్యాణ్‌ పై పరువు నష్టం దావా వేస్తా! à°µà°¿à°¶à°¾à°–పట్నం, జూన్ 9  2018  (DNS Online ) :  à°œà°¨à°¸à±‡à°¨ అధినేత పవన్‌ కళ్యాణ్‌ తనపై చేసిన అభియోగాన్ని 15 రోజుల్లోగా నిరూపించాలని

లేనిపక్షం లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని యలమంచిలి ఎమ్మెల్యే, విశాఖ గ్రామీణ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, పంచకర్ల రమేష్ బాబు హెచ్చరించారు. శనివారం

నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ పోరాటయాత్ర పేరుతో జిల్లాల్లో ప్రచారం చేసుకోవచ్చని, అయితే ఇతరుల

మీద ఆధారాలు లేకుండా అబాండాలు వెయ్యడం తగదన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన ప్రచార యాత్రల్లో భాగంగా పవన్ కళ్యాణ్ యలమంచిలి నియోజక వర్గం లో జరిగిన యాత్రలో

తనపై అబాండాలు వేసి, రోజుకు అనధికారికంగా రూ.6లక్షల ఆదాయం పొందుతున్నట్లు పవన్‌ ఆరోపణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతహాగా సినీ నటుడు కావడం తో ఎవరో రాసిచ్చిన

స్క్రిప్ట్ ను వేదికలపై చదువుతూ, తనకు తెలియని విషయాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారని పంచకర్ల మండిపడ్డారు. ఈ అభియోగాలను 15 రోజుల్లోగా ఆధారాలతో నిరూపించాలని

డిమాండ్‌ చేశారు. నిరూపించలేని పక్షంలో క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో పవన్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam