DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశంలోనే నెంబర్ 1 స్థానం లో ఆంధ్ర ప్రదేశ్:  మంత్రి అవంతి

9  à°¨à±à°‚à°šà°¿ భీమిలి ఉత్సవాల పోస్టర్ విడుదల

డిసెంబర్ లో విశాఖ ఉత్సవ్ : మంత్రి అవంతి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, నవంబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర

ప్రదేశ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన అత్యంత వైభవంగా సాగుతోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోనే నెంబర్ 1 స్థానం లో నిలిచిందని రాష్ట్ర పర్యాటక,

సాంస్కృతిక మరియు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంత్రి తెలిపారు. బుధవారం నగరం లోని ప్రభుత్వ అతిధి గృహం లో భీమిలి ఉత్సవాల

పోస్టర్ విడుదల చేసారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం కు (  à°­à±€à°®à°¿à°²à°¿ ) à°’à°• చరిత్ర ఉన్నదని, దేశంలో భిమిలిలో రెండవ మున్సిపాల్టీని ఏర్పాటు

చేసినట్లు తెలిపారు. గతంలో భీమిలి బీచ్ నుండి ఎగుమతులు జరిగేవన్నారు. అందమైన బీచ్ లు, ఓ ప్రక్క కొండలు, వేగంగా అభివృద్ధి చెందుతుందిని వివరించారు. భీమిలి లో ఉన్న

ప్రతిభా వంతులను గుర్తించి వారికి ప్రోత్సహించనున్నుట్లు చెప్పారు. భీమిలి ఉత్సవ్ ప్రజల వేడుకని, ఇందులో రాజకీయాలు ఉండవన్నారు. భీమిలి చరిత్ర రాబోయే తరాలకు

తెలియాలన్నారు. భీమిలి ఉత్సవ్ తరువాత వచ్చే నెలలో విశాఖ ఉత్సవాలు, తరువాత అరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. అంతకు ముందు భీమిలి ఉత్సవాలకు సంబంధించి 9,10 తేదీల తగరపువలస,

భిమిలిలో జరిగే కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ వివరించారు. 

à°ˆ పోస్టర్ విడుదల కార్యక్రమం లో  à°œà°¿à°µà°¿à°Žà°‚సి కమిషనర్ డాక్టర్ జి సృజన, విఎంఆర్డిఏ

కమిషనర్ కోటేశ్వరరావు, జిల్లా పర్యటక అధికారి పూర్ణిమా దేవి, ట్రాన్స్ కో ఎఇ పాల్గొన్నారు. అంతకు ముందు ఈ భీమిలి వేడుకలను ఎలా నిర్వహించాలో అధికారులకు

తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam